ఎన్హెచ్–44పై ఘోర రోడ్డు ప్రమాదం...యువకుడు మృతి...
ఎన్హెచ్–44పై ఘోర రోడ్డు ప్రమాదం
యువకుడు మృతి
కర్ణాటక-హైదరాబాద్ జాతీయ రహదారి–44,కర్నూ లు నగరం,బళ్లారి చౌరస్తా,ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై మంగళ వారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.ట్రాఫిక్ పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం...రాయచూరు ప్రాం తానికి చెందిన మోహన్ (52), నాగేంద్రప్ప కుమారు డు,తన బంధువుల ఇంటి కార్యక్రమానికి హాజర య్యేందుకు 18ఏళ్ల రాజేష్తో కలిసి యాక్టివా ద్విచక్ర వాహనంపై కల్లురు వైపు వెళ్తున్నారు.ఈ క్రమంలో సా యంత్రం సుమారు 6.10 గంటల సమయంలో అదే దిశగా బెంగళూరు వైపు వెళ్తున్న ఓ లారీ వెనుక నుం చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది.ఢీ కొన్న ప్రభావంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా,రాజేష్ తలపై నుంచి లారీ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్కు గాయాలు అయినట్లు సమాచారం.ప్రమా దానికి కారణమైన లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారి పోయారు.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసు లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీ నం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.ప రారైన లారీని గుర్తించే చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పో లీసులు తెలిపారు.ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Post a Comment