ఎస్బీఐలో రూ.6.87 కోట్ల రుణ మోసం...బ్యాంక్ అధికారి అరెస్టు...
ఎస్బీఐలో రూ.6.87 కోట్ల రుణ మోసం
బ్యాంక్ అధికారి అరెస్టు
2019,జూన్,15 నుండి సెప్టెంబర్,4 మధ్య కాలంలో కవల వెంకట నరసింహం అనే వ్యక్తి,తూర్పు గోదావరి జిల్లా,తాళ్లపూడి మండలం,ప్రక్కిలంకలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ సిబ్బం దితో కుమ్మక్కై సుమారు రూ.6.87 కోట్ల విలువ గల 25 ఎఎబిఎల్ రుణాలను మోసపూరితంగా పొందిన విషయం వెలు గులోకి వచ్చింది.ఈ ఘటనపై బ్యాంక్ అధికారులు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.దర్యాప్తులో భాగంగా,ప్రక్కిలంక ఎస్బీఐ బ్రాంచ్లో ఫీల్డ్ ఆఫీసర్-కమ్-డిప్యూటీ మేనే జర్ (అడ్వాన్స్)గా పనిచేసిన కొవ్వాసి వెంకటరావు దొరను బుధవారం అరెస్టు చేశారు.ఈ చర్య సీఐ డీ ఈఓడబ్ల్యూ ఎస్పీ ఎస్.శ్రీధర్ పర్యవేక్షణలో కేసు ద ర్యాప్తు అధికారి అదనపు ఎస్పీ అస్మా ఫరీన్ చేత చే పట్టబడింది.అరెస్టు చేసిన ముద్దాయిని అవినీతి ని రోధక చట్టం కేసుల విచారణకు ప్రత్యేక న్యాయమూ ర్తి,రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా,కోర్టు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు అడిషనల్ సూపరింటెం డెంట్ ఆఫ్ పోలీస్,సీఐడీ,రీజ నల్ ఆఫీసు,రాజమండ్రి అస్మా ఫరీన్ వెల్లడించారు.
Comments
Post a Comment