తెలంగాణలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల...
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ నోటిఫికే షన్ విడుదల అయింది,ఉన్నంత విద్య మండలి చైర్మ న్ బాలకృష్ణ రెడ్డి,ఈ నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేశారు.మొత్తం మూడు ఫేజ్ ల్లో దోస్త్ రిజి స్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.ఏప్రి ల్,15వ తేదీ నుంచి మే,7వ తేదీ వరకు తొలి విడత లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.అర్హులైన విద్యా ర్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.ఏప్రిల్,30వ తేదీ నుంచి మే,8వ తే దీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.ఒక మే,14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగ నుంది.సీట్ల కేటాయింపు అనంతరం ఆన్ లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.ఇక రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే,2 5వ తేదీ వరకు కొనసాగనుంది.మే,15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే,30వ తేదీ సీట్లు కేటాయి స్తారు.మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే,31వ తేదీ నుంచి జూన్,15వ తేదీ వరకు జరగనుంది.జూన్,16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవ చ్చు.జూన్,20వ తేదీన సీట్ల కేటా యింపు ఉంటుంది.రెండో,మూడో విడత సీట్ల కేటా యింపు అనంతరం కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చే యాల్సి ఉంటుంది.సీట్లు పొందిన విద్యార్థులు ఆ యా కాలేజీల్లో జూన్,20 నుంచి 27వ తేదీ మ ధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియక పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్,29,30వ తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.జూలై,1వ తేదీ నుంచి తరగతులు ప్రా రంభమవుతాయి.
Comments
Post a Comment