సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ ఆశయాలకై పునరంకిత మౌదాం...భారత రాజ్యాంగాన్ని కాపా డుకుందాం...డాక్టర్ కె.బడే సాహెబ్,గ్రాంధాలయ గౌర వాధ్యక్షులు,హిస్టరీ లెక్చరర్...
సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ ఆశయాలకై పునరంకిత మౌదాం
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
డాక్టర్ కె.బడే సాహెబ్,గ్రాంధాలయ గౌరవాధ్య క్షులు,హిస్టరీ లెక్చరర్
సామాజిక విప్లవకారుడు సమతా మూర్తి,భారత రా జ్యాంగ నిర్మాత,మహానీయుడు డా.బాబాసాహెబ్ అం బేద్కర్ 135వ జయంతి సందర్భంగా 32వ వార్డ్,ము జఫర్ నగర్,టి.నరసింహయ్య గ్రంధాలయం నందు గ్రంథాలయ అధ్యక్షులు కె.ప్రభాకర్ అధ్యక్షతన అంబే ద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది.కార్యక్రమానికి నరసింహయ్య గ్రంథాలయం గౌరవాధ్యక్షులు,హిస్టరీ లెక్చరర్ డాక్టర్ కె.బడే సాహెబ్,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,కోశాధికారి ఏం.చిన్న,బి.ఆజాద్,మహిళా సంఘం నగర నాయకు రాలు కె.ధనలక్ష్మిలు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ డా.అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కు లు కల్పించింద న్నారు.సమాజంలో ఉన్న అసమాన తలు,అ న్యాయాలను రూపుమాప డానికి ఆయన జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడా రు.కులం పునాదుల మీద ఒక స్వచ్ఛమైన నీతిని, జాతినిగాని నిర్మించలేమ న్న అంబేద్కర్ కులం సం పూర్ణంగా నిర్మూలించ బడాలన్నారు.నేడు మహిళల కు 33శాతం రిజర్వేషన్ ప్రభుత్వ కల్పిస్తున్నాయంటే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారన్నారు. అంబేద్కర్ లక్ష్యమైన కుల నిర్మూలనను భుజస్కందా లపై వేసుకున్న సమానత్వం కులనిర్మూలన లక్ష్యా లుగా పనిచేస్తుంద న్నారు.కులాలకతీతంగా సామా జిక శక్తులంతా ఐక్యమై రాజ్యాంగ రక్షణతో పాటు, అంటరానితనం నిర్మూలనకై పోరాటాలకు సిద్ధం కా వాలన్నారు.అంబేద్కర్ ఆశయాల కోసం రాజ్యాంగ ప రిరక్షణ కోసం అందరూ కృషి చేయాలని వారు పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమంలో బషీర్ మియ,మహిళా సంఘం నాయకురాలు నాగేశ్వరి,శాలమ్మ,గ్రంథాల య పాఠకులు గోపాలకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment