మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్...వి దే శాల నుండి ఖరీదైన ఇంజక్షన్ తెప్పించిన మంత్రి లోకేష్...
మానవత్వం చాటుకున్న మంత్రి నారా లోకేష్
విదేశాల నుండి ఖరీదైన ఇంజక్షన్ తెప్పించిన మంత్రి లోకేష్
సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా సేవ్ పునర్వి క” అంటూ విస్తృతంగా ప్రచారం సాగింది.లక్షలాది మంది స్పందించి తమవంతు సాయం అందించగా,మరికొం దరు ప్రార్థనలతో మద్దతు తెలిపారు.చిన్నారి ప్రాణాల ను కాపాడేందుకు అవసరమైన ఖరీదైన ఇంజెక్షన్ కోసం విరాళాలు వెల్లువలా వచ్చాయి.ఇంకా అవసర మైన నిధుల సమీకరణలో మంత్రి నారా లోకేష్ ముం దుకు వచ్చి పూర్తి బాధ్యత తీసుకున్నారు.అవసరమై నంత సాయం అందిస్తానని హామీ ఇచ్చి,ఆ మాటను నిలబెట్టుకున్నారు.పునర్వికకు అవసరమైన చికిత్స కోసం విదేశాల నుంచి రూ.16 కోట్ల విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్ రప్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు.చికిత్స సమయంలో కూడా ఆయ న ఆసుపత్రిలోనే ఉండి చిన్నారికి మద్దతుగా నిలిచా రు.ప్రజల ఆశీస్సులతో చిన్నారి ఆరోగ్యం మెరుగు పడుతుండగా,ఆమె చిరునవ్వు తిరిగి కనిపించడం కుటుంబానికి ఆనందం కలిగించింది.అరుదైన స్పైనల్ మస్క్యు లర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న పున ర్వికకు ఈ చికిత్స ప్రాణాధారంగా నిలిచింది.హైదరా బాద్ జూబ్లీ హిల్స్ లోని రెయిన్ బో పిల్లల ఆసుప త్రిలో అమెరికా నుంచి తెప్పించిన జోల్ జెన్ స్మా ఇం జెక్షన్ను వైద్యులు మంత్రి లోకేష్ సమక్షంలో అందిం చారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శిం చిన ఆయన,వైద్యులతో చికిత్స వివరాలు తెలుసు కున్నారు.చిన్నారి ఆరోగ్యం పట్ల అన్ని విధాలా అం డగా ఉంటానని హామీ ఇచ్చారు.
రూ.16కోట్ల ఇంజెక్షన్ ఒక్కటే ఆశ :
కర్నూలు జిల్లా,వెల్దుర్తికి చెందిన ఏడాది వయ సున్న పునర్విక ఈ ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతోంది. తండ్రి సురేష్ కుమార్ సాధారణ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కుటుంబానికి ఈ ఖరీదైన చికిత్స భారం అయ్యింది.మొదట స్థానికంగా చికిత్స చేయించినా,త రువాత హైదరాబా ద్లో పరీక్షలు చేయించగా ఎ స్ఎంఎస్ టైప్-1 అ నినిర్ధారణ అయ్యింది.ఈ వ్యాధికి ఒక్కసారి మాత్రమే ఇచ్చే జీన్ థెరపీ ఇంజెక్షన్ మాత్ర మే పరిష్కారమని వైద్యులు సూచించారు.
Comments
Post a Comment