శారీరక సంబంధం కోసం దారుణం...ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య...
శారీరక సంబంధం కోసం దారుణం
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
హన్మకొండ జిల్లా,పరకాలలో దారుణం జరిగింది.వివా హేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. భర్తను అతి కిరాతకంగా చంపి,ఆధారాలు దొరక్కుం డా పెట్రోల్ పోసి తగులబెట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పరకాలకు చెందిన సుమన్ ఒక రె స్టారెంటులో పని చేస్తున్నాడు.అతనికి భార్య లావ ణ్య,ఇద్దరు పిల్ల లు.భార్యకు కమలాపూర్ మండలం, వంగపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబం ధం ఏర్పడింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య ప లు మార్లు గొడవలు జరిగాయి.ఈ క్రమంలో తన భర్త ను వదిలించుకోవాలనుకున్న లావణ్య,ప్రియుడితో కలిసి చంపేందుకు ప్లాన్ వేసింది.ఇందుకోసం ఒక ము ఠాకు సుఫారీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఆమె కొద్దిరో జుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది.ఆ తర్వాత,ఈ నె ల 3వ తేదీ నుంచి భర్త సుమన్ కని పించకుండా పో యాడు.కొడుకు కోసం వెతి కిన సుమన్ తండ్రి పోలీ సులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.భార్యపై అనుమా నం వచ్చిన పోలీసు లు ఆ దిశగా విచారణ జరపగా, ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు అంగీకరించిం ది.సుఫారీ గ్యాంగ్ మొదట అతనిని బీరు సీసాలతో విచక్ష ణారహితంగా పొడిచి చంపింది.ఈనెల 4వ తేదీన ములుగు జిల్లా,గోవిందరావుపేట మండలం, దయ్యాలవాగు సమీపంలో సుమన్పై పెట్రోల్ పోసి కాల్చివేశారు.సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీ సులు,ఆ తర్వాత ఎనిమిది మందిని అరెస్టు చేశారు. లావణ్యతో పాటు ప్రియుడు,సుఫారీ తీసుకున్న వ్య క్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ద ర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Post a Comment