హైదరాబాద్లో మరో దగుల్బాజీ దందా..భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు...
హైదరాబాద్లో మరో దగుల్బాజీ దందా..
భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు
నగరంలో టీ ప్రియుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కా సులు కురిపించుకుంటున్న ఒక ముఠా గుట్టును పోలీ సులు రట్టు చేశారు.రహస్య సమాచారం మేరకు జరి పిన మెరుపు దాడుల్లో సుమారు నాలుగు టన్నుల క ల్తీ టీ పౌడర్, దానికి సంబంధించిన రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వాడిన పొడికే మళ్లీ రంగులు :
సాధారణంగా హోటళ్లు,టీ స్టాళ్లలో వాడి పారేసిన టీ పొడిని సేకరించి,దానికి హానికరమైన రంగులు,కృత్రి మ సువాసనలు కలిపి తిరిగి ప్యాక్ చేస్తున్నట్లు విచా రణలో తేలింది.ఈ కల్తీ పొడిని చూడగానే అసలైన టీ పొడిలాగే కనిపించేలా రసాయనాలు వాడుతున్నార ని పోలీసులు తెలిపారు.
పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ - 10మంది అరెస్ట్ :
ఈ దందాపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన H-FAST పోలీసులు,అత్యంత గోప్యంగా ఆపరేషన్ ని ర్వహించి,కల్తీ కేంద్రాలపై దాడి చేశారు.ఈ కేసులో మొ త్తం 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నా రు.వీరిలో కల్తీ టీ పొడిని తయారు చేసేవారితో పా టు,తక్కువ ధరకు వస్తుందని తెలిసి కూడా దీన్ని కొ నుగోలు చేస్తున్న కొంత మంది టీ షాప్ ఓనర్లు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ కల్తీ టీ పొడిలో కలిపే రంగు లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తా యని ఆహార భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Post a Comment