తాడేపల్లిలో ఇంధన సెగ...పెట్రోల్ బంకుల వద్ద బారు లు తీరిన వాహనదారులు...
తాడేపల్లిలో ఇంధన సెగ
పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు
తాడేపల్లి పరిధిలో పెట్రోల్,డీజిల్ కొరత సామాన్య ప్ర జలను ఇబ్బందుల్లోకి నెట్టింది.గత కొంతకాలంగా ఇం ధన సరఫరాలో అంతరాయం కలగడంతో,స్థానిక పె ట్రోల్ బంకుల వద్ద వాహనదారు లు భారీగా క్యూ క ట్టారు.పలు బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమి స్తుండటంతో,స్టాక్ ఉన్న పరిమిత బంకుల వద్దకు వా హనదారులు పోటెత్తారు.ద్విచక్ర వాహనాలు,కార్లు,ఆ టోలు కిలోమీటర్ల మేర రహదారిపైనే వేచి ఉండటం తో రాకపో కలకు తీవ్ర అంతరాయం కలిగింది.ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక వాహ నదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు,అత్యవసర పనుల మీద వెళ్లే వారు ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్ర భుత్వం,చమురు సంస్థలు వెంటనే స్పందించి ఈ కొర తను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Post a Comment