మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
బాపట్ల,మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారు లు దాడులు నిర్వహించారు.వివరాల్లోకి వెళితే ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ మాట్లాడుతూ బాపట్ల మున్సిపల్ కా ర్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ రూ.60000లలో రూ.25000 లంచం,రూ.35000 చలానా రూపంలో తీసుకుంటూ పట్టుపడ్డారు.చిన్నగంజాం మండలం,కొత్తపేటకు చెం దిన బాధితుడు దేవరకొండ నాగేంద్రం ఇంటి పన్ను పే రు మార్పు ఫీజు రూ.60000 అడిగారని,బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించగా,ఏసీబీ అధికారులు సూర్య లంక రోడ్డులోని ఒక టీ స్టాల్ వద్ద నగదు లావాదేవీలు జరుగుతున్న క్రమంలో బహిరంగంగా పట్టుకున్నారు. ఈ సంఘటనతో బాపట్ల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.విషయం తెలిసిన వెంటనే బాపట్ల మున్సిప ల్ కార్యాలయంలో ఏ సిబ్బంది తమ సీట్లలో లేకుండా పరారయ్యారు.
Comments
Post a Comment