కర్నూలులో భారీ స్కాం...అక్రమ పీడీఎస్ బియ్యం దందా బట్టబయలు....
కర్నూలులో భారీ స్కాం...అక్రమ పీడీఎస్ బియ్యం దందా బట్టబయలు
కర్నూలు జిల్లా,కోడుమూరు నియోజకవర్గం పరిధి లోని కొత్తూరు సమీపంలో భారీ అక్రమ పీడీ ఎస్ బి య్యం దందా వెలుగులోకి రావడం సంచలనం రేపు తోంది.పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన ప్రభు త్వ రేషన్ బియ్యాన్ని కొందరు దుండగులు గుట్టుచ ప్పుడు కాకుండా రేషన్ బియ్యం గుట్టలుగా నిల్వ చే సి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని స్థా నికుల ఇచ్చిన స మాచారంతో ఈ భారీ స్కాం బట్టబ యలైంది.సంఘటన స్థలంలో టన్నుల కొద్దీ బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ దందా వెనుక చిన్న చిన్న వ్యక్తులు కాదు...పెద్ద మాఫియా నెట్వర్క్ పని చేస్తోందని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.ఇం త భారీ స్థాయిలో అక్రమ రేషన్ బియ్యం నిల్వలు ఉ న్నా...ఇప్పటి వరకు అధికారులకు ఎలా తెలియలే దన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొందరు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేసే బియ్యాన్ని అక్ర మంగా దాచిపెట్టి,లాభాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.ఇప్పటికైనా ఈ భారీ దందాపై వెంటనే విచారణ జరిపి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,కేసు లు నమోదు చేసి మాఫియా నెట్వర్క్ ను పూర్తిగా చె రిపేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇది కేవ లం ఒక ఘటన కాదు...పెద్ద రేషన్ మాఫియా కుట్రకు సంకేతమా? ఈ సంఘటనతో జిల్లాలో మరెన్ని ప్రాం తాల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి.పూర్తి వివరాలు వెలు గులోకి రావాల్సి ఉంది.
Comments
Post a Comment