నిశ్చితార్థం జరిగాక...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన యువకుడు...మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువతి...
నిశ్చితార్థం జరిగాక...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన యువకుడు
మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన యువతి
నిశ్చితార్థం జరిగాక ఆ యువకుడు...నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి...ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది.వైఎ స్సార్ కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో జరిగిన ఈ ఉ దంతంపై ఎస్సై ప్రతాప్రెడ్డి కథనం ప్రకారం...కడప పటేల్ రోడ్డుకు చెందిన రె హానా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసింది.గవర్నర్ చేతుల మీదుగా ఇటీవల పట్టా కూ డా అందుకుంది.ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యో గం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్తో ఫిబ్ర వరి,15న నిశ్చితార్థమైంది.అప్పటి నుంచి వీరిద్దరూ రోజూ ఫోన్లో మాట్లాడుకునేవారు.చాటింగ్ చేసే వా రు.ఇటీవల షాజహాన్...రెహానాతో నువ్వంటే ఇష్టం లేదు,నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ రావడం లేదు.నాకు ఇదివరకే నలుగురు గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు’అని అన్నా డు.ఏదో తమాషాగా అంటున్నాడని తొలుత ఆమె పట్టించుకోలేదు.పదేపదే అతడు అదే మాట అనడం తో తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా సోమవారం గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 12 పేజీల సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.రెహానా తండ్రి మంగళవారం పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.
Comments
Post a Comment