తెలంగాణలో త్వరలో జడ్పిటిసి,ఎంపీటీసీ,ఎన్నిక లు...
తెలంగాణలో త్వరలో జడ్పిటిసి,ఎంపీటీసీ,ఎన్నికలు
తెలంగాణలో జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాల,జడ్పీటీసీ,ఎంపీటీసీ, ఎన్నికలకు రంగం సిద్ధ మైంది,ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎ న్నికల సంఘం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జా రీ చేసింది.దీంతో మరోసారి తెలంగాణలో ఎన్నికల నగరా మోగనుంది...గత డిసెంబర్ నెలలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి కాగా...ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించారు.తాజా గా...ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మండల,జిల్లా ప్రజాపరిషత్ల కు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది.ఇందు లో భాగంగా ఓటర్ల జాబితా తయారీకి కీలక ఆదేశా లు జారీ అయ్యాయి.పరిస్థితులు అనుకూలిస్తే మే నె లలోనే జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.హైదరాబాద్,మేడ్చల్-మల్కా జిగిరి మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్ని కల సంఘం ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసిం ది.కేంద్ర ఎన్నికల సంఘం 2025,జూలై,10 నుండి 20 26,ఫిబ్రవరి,5 వరకు సమీకరించిన ఓటర్ల జాబితా ఆ ధారంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.నియోజకవర్గా ల్లోని అదన పు ఓటర్లను గుర్తించి,వారిని సంబంధిత పంచాయతీలు,పోలింగ్ కేంద్రాల వారీగా వర్గీకరించా లని అధికారులు ఆదేశించారు.ఈ డేటాను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాల్సి ఉంటుంది. డేటాలో ఏవైనా లోపాలు ఉంటే ఈ నెల 23వ తేదీలో పు నివేదించాలని,ఆ తర్వాత ముసాయిదా జాబితా లను విడుదల చేసి,అ భ్యంతరాల స్వీకరణ అనంత రం తుది జాబితాను ప్రకటిస్తామని ఎస్ఈసీ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
Comments
Post a Comment