అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు...అక్రమంగా ఇండ్లల్లో నిల్వ ఉంచిన రేష న్ బియ్యం పట్టివేత...
అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సివిల్ సప్లై అధికారులు
అక్రమంగా ఇండ్లల్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత
ఇల్లందు పట్టణం పరిధి,సత్యనారాయణపురంలో రెండు ఇళ్ళల్లో పిడి ఎస్ బియ్యం నిలువ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు,ఇల్లందు జిసిసి గోడం సమీపాన ఒక ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 100 క్వింటాల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సివిల్ సప్లై డిటిలు మహే ష్,ప్రభాకర్లు తెలిపిన వివ రాల ప్రకారం...ఇల్లందు మున్సిపాలిటీ సత్యనారాయ ణపురంలో రెండు ఇంళ్లలో అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉంచినట్లు సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు దాడీలు నిర్వహించగా ఒక ఇంట్లో 40కింటాళ్లు,మరో ఇంట్లో రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు గుర్తించారు.అలాగే ఇల్లెందు జిసి సి గోడౌన్ సమీపాన ఒక ఇంట్లో 40క్వింటాలు ఉన్న ట్లు గుర్తించి మొత్తం 100క్వింటాల గిరిజన జిసిసి కేంద్రానికి తరలించారు.ఆ మూడు గృహ యజమా నులపై కేసు నమోదు చేసినట్లు డీటీలు తెలిపారు.ఎ వరైనా అక్రమార్కులు రేషన్ దందా చేస్తున్నట్టు ప్రజల దృష్టికి వస్తే సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.అలాంటి సమాచారం ప ట్ల తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఎ టువంటి వెనకాడే పరిస్థితి లేదని అధికారులు తెలి యజేశారు.
Comments
Post a Comment