ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య డ్రైవర్ ఆత్మహత్యా యత్నం...
ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య డ్రైవర్ ఆత్మహత్యా యత్నం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆ ర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య వరంగల్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది.నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ తమ సమస్యలను ప్ర భుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డారు.సమ్మె నేపథ్యంలో ఉద్యో గుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఆయన తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నం చేసినట్లు సమాచారం.ఈ ఘటనను గమనిం చిన సహచరులు,స్థానికులు వెంటనే స్పందించి ఆ యనను అడ్డుకొని ప్రాణాపాయం నుంచి కాపాడారు. తీవ్రగాయాలపాలైన శంకర్ గౌడ్ను వెంటనే చికిత్స ని మిత్తం వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తు తం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలి సింది.ఈ ఘటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన మ రింత పెరిగింది.సమ్మె కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Post a Comment