ప్రజల భద్రతే లక్ష్యం...విజిబుల్ పోలీసింగ్...విస్తృత తనిఖీలు...అనుమానితులపై ప్రత్యేక దృష్టి... జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ...
ప్రజల భద్రతే లక్ష్యం.
విజిబుల్ పోలీసింగ్
విస్తృత తనిఖీలు
అనుమానితులపై ప్రత్యేక దృష్టి
జి.మారుతీ శంకర్,ఒకటవ పట్టణ సిఐ
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూ లు పోలీసులు రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పో లీసింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంగళ వా రం రాత్రి 11-00నుంచి తెల్లవారు జామువరకు క ర్నూలు ఒకటవ పట్టణ సీఐ జి.మారుతి శంకర్ ఆధ్వ ర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలోని కొం డారెడ్డి బురుజు వద్ద క్యూఆర్టీలు,బ్లూ కోల్ట్స్ సిబ్బం దికి రాత్రి గస్తీ విధులపై దిశా నిర్దేశం చేశారు.రాత్రి 11-00గంటల తర్వాత దుకాణాలు మూసివేయడం పర్య వేక్షించడంతో పాటు,ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా నిరంతరం పహారా నిర్వహించా రు.అనుమానాస్పద వ్యక్తులను తనిఖీలు చేశారు.రా జ్ విహార్ సెంటర్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టా రు.మయూరి లాడ్జ్లో తనిఖీలు నిర్వహించి,అను మానాస్పద అసాంఘిక కార్యక లాపాలపై నిఘా ఉం చారు.జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీ సులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని,వి జిబుల్ పోలీసింగ్ లో భాగంగా కాలినడకన పర్యటి స్తూ,పోలీసు వాహనాలతో సైరన్ మోగిస్తూ మీ భద్రతే మా బాధ్యత అంటూ,ప్రజలు కూడా పోలీసులకు స హకరించాలని పోలీసు అధికారులు కోరారు.
Comments
Post a Comment