ప్రమాదకర స్టంట్స్కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు...ద్విచక్ర వాహనం సీజ్...
ప్రమాదకర స్టంట్స్కు పాల్పడిన యువకుడిపై కేసు నమోదు
ద్విచక్ర వాహనం సీజ్
కృష్ణా జిల్లా,పెనమలూరు మండలానికి చెందిన వై. మణిశాంత్ (25) అనే యువకుడు తన యమహా MT ద్విచక్ర వాహనంపై రీల్స్లో లైక్స్ కోసం,అమ్మా యిలను ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఈడ్పుగల్లు, గోసాల,కంకిపాడు ఫ్లై ఓవర్,పెనమలూరు ప్రాంతాల్లో ప్రమాదకరంగా స్టంట్స్ చేస్తూ ప్రజలను భయబ్రాంతు లకు గురిచేస్తున్నట్లు కృష్ణా జిల్లా పోలీసుల దృష్టికి వచ్చింది.
ఘటన పట్ల జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదే శాల మేరకు కంకిపాడు ఎస్ఐ డి.సందీప్ వాహ న నంబర్ ఆధారంగా అతనిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అతనిపై పలు చట్టపరమై న సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి,ద్విచక్ర వాహనా న్ని సీజ్ చేసి,భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర చర్య లకు పాల్పడవద్దని గట్టిగా హెచ్చరించారు.ఈ సంద ర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ రహదారులపై స్టంట్స్ చేయడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రా ణాలకు ముప్పు కలుగుతుందని,అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
Comments
Post a Comment