రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం...నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు...
రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ కట్టుదిట్టం
నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు పట్టణంలో ప్రజల భద్రత,శాంతి భద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమం ద్వారా నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వాహ నాల తనిఖీలు చేపడు తున్నారు.ఈ క్రమంలో శుక్ర వారం రాత్రి కర్నూలు నాలుగవ పట్టణ సిఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు నుండి బళ్లారి చౌరస్తా వరకు, అలాగే పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక వి జిబుల్ పోలీసింగ్ నిర్వ హించారు.14 బ్లూ కోల్ట్స్ బృందాలు,నాలుగు క్యూ ఆర్టీ బృందాలు పాల్గొని కట్టుదిట్టంగా విజిబుల్ పోలీ సింగ్ చేపట్టాయి.రాత్రి 11-00 గంటల తర్వాత షాపు లు షాపులు మూసి వేయిస్తున్నారు.అత్య వసరమైతే తప్ప బ యటకు రావద్దని సూచించా రు.అనవసరం గా బయట తిరిగే వారిపై కఠినచర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.ప్రజలు పోలీసులకు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు.ఎక్కడైనా సమస్యలు ఉంటే అ త్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112/100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Post a Comment