ఫెయిల్ భయంతో బోర్డుకు విద్యార్థి ఫోన్ అధికారుల కౌన్సెలింగ్...
ఫెయిల్ భయంతో బోర్డుకు విద్యార్థి ఫోన్ అధికారుల కౌన్సెలింగ్
ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంటర్ విద్యార్థి బోర్డు అధికారులకు ఫోన్ చేసి సహాయం కోరి న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.విద్యార్థి ఆందోళనను గుర్తించిన అధికారులు వెంటనే స్పందిం చి,ఫోన్లోనే కౌన్సెలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు.వివరా ల్లోకి వెళితే...విశాఖకు చెందిన ఇంటర్ ద్వితీయ సం వత్సరం విద్యార్థి ఒకరు ఫలితాలకు ముందు బోర్డు అధికారులకు ఫోన్ చేశాడు.పరీక్షల్లో తాను సరిగా చదవలేదని,జవాబు పత్రంలో ప్రశ్నాపత్రాన్నే మూడు సార్లు రాశానని తెలిపాడు.ఫలితాల్లో ఫెయిల్ అవు తాననే భయంతో తీవ్రఆందోళనకు గురైనట్లు అధికా రులకు వివరించాడు.విద్యార్థి పరిస్థితిని అర్థం చేసు కున్న అధికారులు అతనికి ఫోన్లోనే కౌన్సెలింగ్ ఇ చ్చారు.కంగారు పడాల్సిన అవసరం లేదని,త్వరలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని,వాటి కి బాగా సిద్ధమవ్వాలని సూచించారుఅలాగే ఈ విష యాన్ని సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి అవసరమైన జాగ్ర త్తలు తీసుకో వాలని సూచించారు.కాగా,అనంతరం విడుద లైన ఫలితాల్లో ఆ విద్యార్థి మొత్తం ఐదు సబ్జె క్టుల్లో ఫెయిల్ అయినట్లు తేలింది.ప్రస్తుతం విద్యార్థి ఇంట్లోనే సురక్షితంగా ఉన్నాడని,భవిష్యత్తులో బాగా చదివేలా చూసుకుంటామని అతని తల్లి,దండ్రులు అ ధికారులకు హామీ ఇచ్చారు.
Comments
Post a Comment