అమరావతిని అజరామరం చేశారు...ఐదుకోట్ల ఆంధ్రుల త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకి కృత‌జ్ఞ‌ త‌లు...మంత్రి నారా లోకేష్,ఎన్డీఏ ఎంపీలు...

అమరావతిని అజరామరం చేశారు
ఐదుకోట్ల ఆంధ్రుల త‌ర‌ఫున రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకి కృత‌జ్ఞ‌త‌లు
మంత్రి నారా లోకేష్,ఎన్డీఏ ఎంపీలు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌రికొత్త చ‌రిత్ర‌కు దేశ ప్ర‌థ‌మ‌పౌరురాలు సాక్షి సంత‌కం కావ‌డం చ‌రిత్ర‌లో నిలిచిపోయే ఘ‌ట్ట‌మ‌ ని విద్య‌,ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప్ర‌శంసిం చారు.ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన బిల్లుకు దేశ‌మం తా ఒక్క‌టై మ‌ద్ద‌తు ఇవ్వగా,రాజ‌ముద్ర వేసి అమ‌రా వ‌తికి శాశ్వ‌త‌ త్వం క‌ల్పిస్తూ శాస‌నం చేసిన‌ రాష్ట్ర‌ప‌ తి ద్రౌపది ముర్ముకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులు జేజే లు పలుకుతున్నారు.రాష్ట్ర విభ‌జ‌న‌తో కోలుకో ని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌ష్ట‌పోయింద‌ని,రాజ‌ధాని లేని రాష్ట్రంగా తీవ్ర నిర్ల‌క్ష్యానికి గురైంద‌ని,అయితే మా రా ష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-మా రాజ‌ధాని అమ‌రావ‌తి అని గు ర్తించి...ఐదుకోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపంగా అ మ‌రావ‌తిని రాజ‌ధానిగా నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌జాతి స‌గ‌ ర్వంగా త‌ల ఎత్తిచాటేలా చారిత్ర‌క అమ‌రావ‌తి రాజ‌ ధాని చ‌ట్టంపై సంత‌కం చేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ము ర్ముకి మంత్రి నారా లోకేష్,ఎన్డీఏ ఎంపీలు రాష్ట్ర‌ప్ర‌తి భ‌వ‌న్‌లో క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు.ఈ సంద‌ ర్భంగా అమ‌రావ‌తి చ‌రిత్ర‌-సంస్కృతి-రాజ‌ధానిలో పూర్తయిన నిర్మాణాలు,రైతుల ఉద్యమం,మాస్ట‌ర్ ప్లా న్ ప్ర‌కారం మొత్తం నిర్మాణాలు పూర్త‌యితే అమ‌రా వ‌ తి రాజ‌ధాని ఎలా ఉంటుందో సూచించే ఊహాచిత్రా లు, ప‌ర్యావ‌ర‌ణ‌హిత నిర్మాణ విశేషాల‌తో రూపొం దించిన పుస్త‌కాన్ని ఎంపీల‌తో క‌లిసి లోకేష్ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకి అంద‌జేశారు.అనంతరం లోకేష్ మా ట్లాడుతూ అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీ, 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన త రువాత అమరావతి పనులు పునః ప్రారంభించింది ప్ర ధాని నరేంద్ర మోదీ అని రాష్ట్రపతికి వివరించారు.రా ష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాజధాని ఏర్పా టు కోసం చంద్రబాబు పిలుపుతో 58రోజుల్లోనే 34వే ల ఎకరాల భూములు రైతులు త్యాగం చేశారని,గత పాలనలో వారిపై దాడులు జరిగినా,అక్రమ కేసులు పెట్టినా,శాంతియుతంగా రాజధాని కోసం ఉద్యమిం చారని రాష్ట్రపతికి లోకేష్ వివరించారు.కోట్లాది ప్ర‌జ‌ ల కోరిక అయిన అమ‌రావ‌తి చ‌ట్టం త‌న హ‌యాంలో రూపొంద‌డం సంతోషంగా ఉంద‌ని,రైతులు రాష్ట్రంపై ప్రేమతో రాజధాని నిర్మాణం కోసం తమ భూమిని ఇ చ్చారని రాష్ట్రపతి రైతుల త్యాగాలను కొనియాడా రు.పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండి పోతుందని అన్నారు.ముఖ్య మంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధాని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని అభిప్రాయ పడ్డారు.ఆంధ్ర‌ ప్ర‌దేశ్ అభివృద్ధి పథంలో ప‌య‌నించా ల‌ని,రాజ‌ధాని ప‌నులు నిర్విఘ్నంగా కొన‌సాగాల‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...