విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయా లనే దారుణమైన కుట్ర...సుపారీ హత్యకు ప్లాన్ చేసి న తండ్రి...
విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయాలనే దారుణమైన కుట్ర
సుపారీ హత్యకు ప్లాన్ చేసిన తండ్రి
జనగామ జిల్లా,రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బ డి తండాలో,తరిగొప్పుల మండలం,ఆంక్షాపూర్ గ్రా మానికి చెందిన అనిత తన ఇద్దరు కుమారులు.. (ఒ కరికి ఆరేళ్లు,ఇంకొక అబ్బాయి తొమ్మిదేళ్లు)తో కలిసి నివాసముంటోంది.భర్త ఏడాది క్రితం శ్రీనివాస్ దుబ్బ తండాకు చెందిన మూడావత్ మమతను రెండవ పెళ్లి చేసుకోగా.అనిత పోలీసులను ఆశ్రయించింది..! దీం తో పోలీసులు సమస్య పరిష్కారం కోసం చేసిన సూ చనలతో... తండాకు చెందిన పెద్దమనుషులతో పం చాయతీ ఏర్పాటు చేయించింది.ఇద్దరు పిల్లల పేరిట ఇరవై గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చే యాలని పెద్దమనుషులు తీర్మానించారు.దీంతో ఆ భూమి సాగు చేసుకుంటు కూలీ పనులు చేస్తూ అని త పిల్లల బాగోగులు చూసుకుంటోంది.కొద్దిరోజులకు తన భూమి తనకు ఇవ్వాలని శ్రీనివాస్ అనితను వే ధించడం మొదలు పెట్టడంతో మరోసారి అనిత పోలీ సులను ఆశ్రయించింది.శ్రీనివాస్ ఎలాగైనా భూమిని దక్కిం చుకోవాలనే పట్టుదలతో ఉన్మాదపు ఆలోచన చేశాడు.రెండో భార్యతో కలిసి అనిత పిల్లలను అంత మొందించేందుకు ప్లాన్ రూపొందించాడు.స్కూల్ కు వెళ్ళే ఇద్దరు కుమారులకు ఎలాగైనా విషం కలిపిన బిస్కట్లు తినిపించాలని ప్లాన్ చేశాడు.అనుకున్న ప్ర కారం ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చి అతని ద్వారా పిల్లల కు బిస్కట్లు తినిపించాలని చూసాడు.అయితే సుపా రీ ఒప్పందం చేసుకున్న వ్యక్తి మానవత్వంతో ఆలో చించి...నేరుగా శ్రీనివాస్ కుట్ర విషయాన్ని అనితకు చెప్పాడు.దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసిం ది.కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ సహా అ తని రెండవ భార్య మమతను అరెస్టు చేసి రిమాం డుకు తరలించారు.ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.రెండు మండలాల పరిధిలో ఉన్న తండాల వాసులు నిందితులపై తీవ్రఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.వారిద్దరిని తండాకు మళ్లీ రాకుండా బహిష్కరించాలని అభిప్రాయప డుతున్నారు.
Comments
Post a Comment