విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయా లనే దారుణమైన కుట్ర...సుపారీ హత్యకు ప్లాన్ చేసి న తండ్రి...

విషం కలిపిన బిస్కిట్లతో సొంత బిడ్డలను చంపేయాలనే దారుణమైన కుట్ర
సుపారీ హత్యకు ప్లాన్ చేసిన తండ్రి
VS9TV న్యూస్,జనగామ :
జనగామ జిల్లా,రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బ డి తండాలో,తరిగొప్పుల మండలం,ఆంక్షాపూర్ గ్రా మానికి చెందిన అనిత తన ఇద్దరు కుమారులు.. (ఒ కరికి ఆరేళ్లు,ఇంకొక అబ్బాయి తొమ్మిదేళ్లు)తో కలిసి నివాసముంటోంది.భర్త ఏడాది క్రితం శ్రీనివాస్ దుబ్బ తండాకు చెందిన మూడావత్ మమతను రెండవ పెళ్లి చేసుకోగా.అనిత పోలీసులను ఆశ్రయించింది..! దీం తో పోలీసులు సమస్య పరిష్కారం కోసం చేసిన సూ చనలతో... తండాకు చెందిన పెద్దమనుషులతో పం చాయతీ ఏర్పాటు చేయించింది.ఇద్దరు పిల్లల పేరిట ఇరవై గుంటల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చే యాలని పెద్దమనుషులు తీర్మానించారు.దీంతో ఆ భూమి సాగు చేసుకుంటు కూలీ పనులు చేస్తూ అని త పిల్లల బాగోగులు చూసుకుంటోంది.కొద్దిరోజులకు తన భూమి తనకు ఇవ్వాలని శ్రీనివాస్ అనితను వే ధించడం మొదలు పెట్టడంతో మరోసారి అనిత పోలీ సులను ఆశ్రయించింది.శ్రీనివాస్ ఎలాగైనా భూమిని దక్కిం చుకోవాలనే పట్టుదలతో ఉన్మాదపు ఆలోచన చేశాడు.రెండో భార్యతో కలిసి అనిత పిల్లలను అంత మొందించేందుకు ప్లాన్ రూపొందించాడు.స్కూల్ కు వెళ్ళే ఇద్దరు కుమారులకు ఎలాగైనా విషం కలిపిన బిస్కట్లు తినిపించాలని ప్లాన్ చేశాడు.అనుకున్న ప్ర కారం ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చి అతని ద్వారా పిల్లల కు బిస్కట్లు తినిపించాలని చూసాడు.అయితే సుపా రీ ఒప్పందం చేసుకున్న వ్యక్తి మానవత్వంతో ఆలో చించి...నేరుగా శ్రీనివాస్ కుట్ర విషయాన్ని అనితకు చెప్పాడు.దీంతో అనిత పోలీసులకు ఫిర్యాదు చేసిం ది.కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్ సహా అ తని రెండవ భార్య మమతను అరెస్టు చేసి రిమాం డుకు తరలించారు.ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.రెండు మండలాల పరిధిలో ఉన్న తండాల వాసులు నిందితులపై తీవ్రఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.వారిద్దరిని తండాకు మళ్లీ రాకుండా బహిష్కరించాలని అభిప్రాయప డుతున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...