కేరళలో వెల్లివిరిసిన మానవత్వం...అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...
కేరళలో వెల్లివిరిసిన మానవత్వం
కేరళలోని ఆలప్పుజ జిల్లాలో మానవత్వాన్ని చాటే ఒక అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది.కోజికోడ్ నుండి పతనంతిట్ట వెళ్తున్న కేఎస్ఆర్టీసీ సూపర్ ఫాస్ట్ బస్సు అర్ధరాత్రి 12-00 గంటల సమయంలో ఎస్.ఎ ల్.పురం అనే నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది. అక్క డ ఒక యువతి బస్సు దిగగా,ఆ ప్రాంతం చీకటిగా,ఎ వరూ లేకపోవడాన్ని గమనించిన డ్రైవర్ అరుణ్ కు మార్,కండక్టర్ సునీల్ ఆమె భద్రత గురించి ఆందోళ న చెందారు.భద్రత కోసం నిలిచిపోయిన బస్సు యు వతిని తీసుకెళ్లడానికి ఇంటి నుండి ఎవరూ రాలేదని తెలుసుకున్న డ్రైవర్,ఆమె కుటుంబ సభ్యులు వచ్చే వరకు బస్సును కదిలించకూడదని నిర్ణయించుకు న్నారు.సాధారణంగా బస్సు ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేసే ప్రయాణికులు సైతం,ఆ యువతి భద్రత కోసం అక్కడే వేచి ఉండటానికి సంతోషంగా ఒప్పు కున్నారు.మానవత్వం ముందు సమయం ముఖ్యం కాదని అందరూ నిరూపించారు.అమ్మవడిగా మారిన బస్సు యువతి కుటుంబ సభ్యులు వాహనంతో అక్క డికి చేరుకున్నాకే బస్సు ముందుకు సాగింది.బస్సులో ప్ర యాణిస్తున్న జుబిన్ జాకబ్ అనే జర్నలిస్ట్ ఈ విష యాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వై రల్గా మారింది.కేరళలో 'ఆనబండి' (ఏ నుగు వాహ నం)గా పిలువబడే ఈ బస్సు,ఆ యువతిని తల్లిలా కాపాడటంతో నెటిజన్లు దీనిని 'అమ్మవండి' అని కొని యాడుతున్నారు.ఈ ఘటన సమాజానికి మంచి ఆ దర్శం అయింది.ఆలోచన మంచిదైతే...సమాజం సహకరిస్తుంది అని మరోసారి నిరూపితమైంది.
Comments
Post a Comment