డ్రగ్స్,గంజాయి రహిత సమాజం కోసం కలిసి కట్టుగా పోరాడుదాం...రామన్న,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి...

డ్రగ్స్,గంజాయి రహిత సమాజం కోసం కలిసి కట్టుగా పోరాడుదాం
రామన్న,డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి 
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
డ్రగ్స్,గంజాయి రహిత సమాజం కోసం సమాజ అభి వృద్ధి కామకులందరూ కలిసికట్టుగా పనిచే యాలని, మాదకద్రవ్యాలను అరికట్టి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేద్దామని డివైఎఫ్ఐ రాష్ట్ర కా ర్యదర్శి జి.రామన్న పిలుపు నిచ్చారు.శనివారం యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లా యర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మన్న అధ్య క్షతన కర్నూలు నగరంలోని స్టేడియంలో కరపత్రాలు పంపిణీ,అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, ప్రముఖ న్యాయవాది జయరాజ్,యాంటీ డ్రగ్స్ ఫోరం కన్వీనర్ అబ్దుల్లా,కో కన్వీనర్ రంగప్ప,కమిటీ సభ్యు లు రాఘవేంద్ర,గురుశేఖర్,రాజేష్ లు మాట్లాడుతూ డ్రగ్స్,గంజాయి రోజురోజుకీ వాడవాడలా వీధివీధినా పాకుతూపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యం గా యువతను,విద్యార్థులను టార్గెట్ చేస్తు సమాజా న్ని విచ్ఛిన్నం చేస్తున్న గంజాయి మాఫియాపై కఠిన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దేశ భవిష్య త్తును నిర్దేశించాల్సిన గంజాయి,డ్రగ్స్ మత్తులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నా రు.పోలీస్ అధికారులు మరింత నిఘా పెంచాలని కోరారు.రాజకీయ నాయకులు అండదండలతోనే డ్రగ్స్,గంజాయి రవాణా అవుతుందని,అన్ని రాజకీ య పార్టీలు తమ పార్టీలలో ఉన్న గంజాయి,డ్రగ్స్ మాఫియా ముఠాలను బహిష్కరించి,తమ నిజాయి తీని నిరుపించుకోవాలని డిమాండ్ చేశారు.యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతకు, విద్యార్థులకు అవగాహన సదస్సులు,ర్యాలీలు,గ్రూప్ సమావేశాలు,కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్,గంజాయి మాఫి యాపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావా లని పిలుపునిచ్చారు.మాదకద్రవ్యాలు వంటి సామా జిక రుగ్మతకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్,గంజాయి భాదితులకు రిహబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం నిధు లు కేటాయించి డ్రగ్స్ మాఫియాను రూపుమాపాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాంటీ డ్రగ్స్ ఫోరం స భ్యులు హుస్సేన్ భాష,ప్రకాష్,కిషన్ రెడ్డి,అంజి,రాజా, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...