వేసవికాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టించాలి...డాక్టర్ అనూష,యుపి హెచ్ సి డాక్టర్...
వేసవికాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పా టించాలి
డాక్టర్ అనూష,యుపి హెచ్ సి డాక్టర్
డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఇందిరానగర్ యుపిహెచ్ సి డాక్టర్ అనూష వేసవి కాలంలో ఎదురయ్యే వడదెబ్బ,ఇతర సమస్యలు గురించి ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయం పరిధిలోగల యుపిహెచ్ సి లలో,ఓఆ ర్ ఎస్,జిమ్ కార్నర్ ఏర్పా టు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ముఖ్యంగా వృద్ధులు,గర్భవతులు,చిన్న పిల్లలు మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 5-00 గంటల వరకు ఎండలో తిరగటం ప్రమాదకరం అన్నారు.ముఖ్యంగా పలుచనీ కాటన్ దుస్తులు ధరిం చాలని,నిండు రంగు దుస్తులను ధరించవద్దని లైట్ కలర్ దుస్తులు ధరించడం వల్ల ఎండవేడినీ త్వరగా తీసుకోదని చెప్పారు.అత్యవసరంగా బయటకు వెళ్ళ వలసిన సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాల ని,నూనె సంబంధించిన పదార్థాలను దూరంగా ఉం చాలని,నూనె పదార్థాలు స్వీకరించటం వల్ల డిహైడ్రే షన్ కి గురవుతారని పేర్కొన్నారు.కనీసం రోజుకి మూ డు నుంచి నాలుగు లీటర్ల నీరు త్రాగాలి.మద్యం సే వించే అలవాటు కానీ టీ కాఫీ ఇలాంటి అలవాట్లు త గ్గించాలని అవి సేవించడం వల్ల డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.బయటకు వచ్చే స మయంలో చర్మరక్షణ కోసం సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ వా డాలని,అదేవిధంగా సన్ క్లాసెస్ వాడటం వల్ల సూర్యు డి నుంచి వచ్చే కిరణాలు కంటికి తగలకుండా రక్షణ గా నిలుస్తాయని తెలిపారు.వేసవికాలంలో కచ్చితం గా బార్లీ వాటర్,సబ్జా వాటర్,నిమ్మరసం,బట్టర్ మిల్క్ (మజ్జిగ),వంటివి తీసుకోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి గురవకుండా శరీరం వేడి చేయకుండా ఉంటుంది. అదే విధంగా ఎవరైనా వడదెబ్బ తగిలి కనపడితే వా రిని ముందు మంచి నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువె ళ్లి,వారికి గాలి తగిలేలా చేయాలి.వారికి ఓఆర్ఎస్ కా నీ,మంచినీరు కానీ తాగించాలి.వారు ఒకవేళ స్పృహ లో లేకపోతే వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిం చి సరైన వైద్యం అందేలా సాయపడాలి.అన్ని ప్రభు త్వాసుపత్రులలో సెలైన్లు ఓఆర్ఎస్ పూర్తిగా అందు బాటులో ఉన్నాయని డాక్టర్ అనూష తెలిపారు.
Comments
Post a Comment