బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది... ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి,విద్యాశా ఖాధికారులు 1-2...
బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది
ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారి,
విద్యాశాఖాధికారులు 1-2,
కల్లూరు మండలంలో విద్యాశాఖాధికారులు 1-2 ఎం,శ్రీనివాసులు,జి.వనజ కుమారిల ఆధ్వ ర్యంలో గురువారం బడి పిలుస్తోంది,ప్రభుత్వ బడి పిలుస్తోంది ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.సుధాకర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా కల్లూరు అర్బన్,శరీన్ నగర్,వైఎస్సార్ సర్కి ల్ లో ప్రతి పిల్లవాడు ప్రభుత్వ బడులలో చేరాల ని కోరుతూ మానవహారం నిర్వహించారు.అ దేవిదంగా అర్హత కలిగిన చిన్నారులను ఒక టవ తరగతిలో చేర్పించడం జరగాలని,షరీఫ్ నగర్ ప్రాంతంలో ర్యాలీ చేపట్టారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వ బడుల అడ్మిషన్ లలో భాగంగా అం గన్ వాడి కేంద్రం నుండి ఆరు మంది విద్యార్తు లను షరీన్ నగర్ లోని మండల పరిషత్ ప్రాథ మిక పాఠశాలలో చేరిపించేలా కృషి చేయాలనీ సూచించారు.బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో చేరాలని,ఐదు సంవత్సరాలు పూ ర్తి చేసిన ప్రతి బాల,బాలికలు ప్రభుత్వ పాఠశా లలో చేరాలని తల్లిదండ్రులకు వారు విజ్ఞప్తి చే శారు.అంతేకాకుండా తల్లిదండ్రులతో ప్రత్యక్షం గా మాట్లాడి,ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరి కలను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో డి ప్యూటీ ఈఓ శ్రీధర్ బాబు,ఎఎంఓ రఫి,అంగ న్ వాడి సూపర్ వైజర్ లు,ఉపాధ్యాయులు,ప్రధా నోపాధ్యాయులు,చైర్మన్ లు,సిఆర్ ఎంటిలు, మిస్ కో ఆర్డినేటర్,అకౌంటెంట్,విద్యాకమిటీ స భ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment