రేపు వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచుర ణ...ఈ నెల 24వరకు సలహాలు,సూచనల స్వీ కరణ...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు...
రేపు వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచురణ
ఈ నెల 24వరకు సలహాలు,సూచనల స్వీకరణ
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
రాష్ట్ర ప్రభుత్వం మార్చి,24న జారీ చేసిన జీవో నెంబర్ 65 ఉత్తర్వుల మేరకు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్ని కల వార్డులను 68వార్డులుగా పునర్విభజన కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను సోమవారం ప్రచురించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఒ క ప్రకటనలో తెలిపారు.సోమవారం వార్డుల స రిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయి దాను అధికారికంగా ప్రచురించి,మున్సిపల్,క లెక్టరేట్,ఆర్డీవో,తహశీల్దార్లు, సబ్-రిజిస్ట్రార్ కా ర్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించను న్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధా రంగా అన్ని సమగ్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ముసాయిదాను రూపొందించి నట్లు కమిషనర్ పేర్కొన్నారు.ముసాయిదాపై ప్రజలు,ప్రజాప్రతినిధులు,రాజకీయ పార్టీలు,ప్ర జా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయా లు,సలహాలు,సూచనలు ఏవైనా ఉంటే ఈనెల 24వ తేదీ సాయంత్రం 5-00గంటలలోపు నగ రపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక వి భాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని క మిషనర్ కోరారు.
Comments
Post a Comment