శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు...
శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు
ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు,సమావేశాలకు అనుమతి లేదు
ఎం.ఉపేంద్ర బాబు,కర్నూలు ఇంచార్జ్ డీఎస్పీ
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ,ప్రజా ప్రశాంతత దృష్ట్యా భా రతీయ పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 30 పో లీసు యాక్ట్ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని కర్నూలు ఇంచార్జ్ డీఎస్పీ ఎం.ఉపేంద్ర బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు.కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో తరచుగా జరుగుతున్న ధ ర్నాలు,ఆందోళనలు,రాస్తారోకోలు తదితర కార్యక్రమాల వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ముందస్తు లిఖి తపూర్వక అనుమతి లేకుండా ప్రజా సమావే శాలు,ఆందోళనలు,ధర్నా లు,రాస్తారోకోలు,ఊ రేగింపులు,ప్రచార కార్యక్రమాలు నిర్వహించరా దని స్పష్టం చేశారు.అనుమతుల కోసం ఆర్గ నైజర్లు,నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని సూ చించారు.ఈ ఉత్తర్వులు ఈ నెల 01వ తేదీ నుండి 31వ తేదీ వరకు కర్నూలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అమలులో ఉంటుందని ఇం చార్జి డిఎస్పీ తెలిపారు.
Comments
Post a Comment