32వ వార్డు,ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలి...సిపిఎం డిమాండ్...
32వ వార్డు,ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలి
సిపిఎం డిమాండ్
కర్నూలు మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య తక్షణ మే పరిష్కరించాలని కాలనీలోని 10వ లైన్ లో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా చే పట్టారు.ఈ సందర్బంగా సిపిఎం పార్టీ న్యూసి టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ మాట్లా డుతూ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు,ము జఫర్ నగర్ లో హంద్రీ వెంట ప్రతి లైనుకు దా దాపు 15ఇండ్లకు మంచినీరు సరఫరా సరిగా జరగడంలేదని అన్నారు.ప్రజలు కనీసం తాగు నీటికి కూడా నోచుకోవడం లేదని ఆవేదన చెం దారు.తాగునీటి సమస్యను పరిష్కరించలే ని అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఆందోళ న చేపట్టడం జరిగిందని చెప్పారు.అంతేకాకుం డా...32వ వార్డ్ లో వాటర్ మెన్ ల వ్యవ హా రం దారుణంగా ఉందన్నారు.ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కడుతున్న ప్రజలు తమ ఇంటి నిర్మాణానికి కుళాయి నీరు వాడుకోకూ డదు అని రాష్ట్రంలో లేని కొత్త నిబంధనలతో కుళాయిలు తొలగించడం దుర్మార్గం అని మం డిపడ్డారు.ఇప్పటికైనా వాటర్ మెన్ లు ఇలాం టి దుర్మార్గమైన వ్యవహారాలు మానుకోవాల ని,స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు.లేనిపక్షంలో ప్రజలను సమీక రించి నగర పాలక సంస్థ వద్ద ఆందోళన చేప ట్టాల్సి వస్తుందని అన్నారు.అదే విదంగా హం ద్రీ వెంట ఉన్న దాదాపు లైన్ నుంచి చివరి దా కా ఒక్కొక్క లైన్ కు 15ఇళ్లకు మంచి నీరు స రఫరా సరిగా కావడం లేదని,గతంలో వేసిన పై ప్ లైన్ చిన్నదిగా ఉందన్నారు.ఈ విషయంలో అధికా రులకు,వార్డ్ కార్పోరేటర్ దృష్టికి తీసు కెళ్లి పైప్ లైన్లు మార్చాలని పలుమార్లు మొర పెట్టుకున్న కనికరించే నాధుడే లేరని మండిప డ్డారు.కావున మునిసిపల్ అధికారులు స్పం దించి మంచినీటి సమస్య పరిష్కారం చేయా లని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజలు శకుంతల,శీను,హైమావతి, జయమ్మ,గౌడ్ వెంకటలక్ష్మమ్మ,శేషయ్య,అ య్యన్న,గఫూర్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment