ఎల్ఆర్ఎస్ మేళాకు విశేష స్పందన... దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందజేత...
ఎల్ఆర్ఎస్ మేళాకు విశేష స్పందన
దరఖాస్తుదారులకు వెంటనే ప్రొసీడింగ్స్ అందజేత
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
ఏళ్ల తరబడి చట్టబద్ధత పొందని లే అవుట్లకు విముక్తి కల్పించే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీ మ్ (ఎల్ఆర్ఎస్) కు సంబంధించి ఇప్పటికే ద రఖాస్తు చేసుకొని వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఎల్ ఆర్యస్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వా రికి ప్రక్రియ పూర్తి చేసి ప్రొసీడింగ్స్ అందజే సేం దుకు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురు వారం ప్రారంభించిన ఎల్ఆర్ఎస్ మేళాకు దర ఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు గడువు ముగిసిన నే పథ్యంలో ప్రక్రియ పూర్తికి అవసరమైన షార్ట్ ఫాల్ పత్రాలు సమర్పించి,ఫీజులు చెల్లించిన వారికి కమిషనర్ చల్లా ఓబులేసు ధృవీకరణ పత్రాలు, ప్రొసీడింగ్స్ అందజేశారు.ఈ సంద ర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ఎల్ఆ ర్ఎస్కు దరఖాస్తు చేసిన వారు అవసరమైన పత్రాలు,ఫీజులు త్వరితగతిన పూర్తి చేసుకు ని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవ లు అందిస్తున్నట్లు తెలిపారు.ఇంకా ఎవరైనా దరఖాస్తుదారులు మిగిలి ఉంటే శుక్రవారం మే ళాను వినియోగించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సిటీ ప్లానర్ వై.వెం కటరమణ,పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా,బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు,ప్లానింగ్ కార్యదర్శు లు,ఎల్టీపీలు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment