నా శవాన్ని కుక్కలకు వదిలేయండి...సూసైడ్ నోట్ తో వ్యక్తి ఆత్మహత్య...
నా శవాన్ని కుక్కలకు వదిలేయండి
సూసైడ్ నోట్ తో వ్యక్తి ఆత్మహత్య
ఏపీలోని నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ మండలం,ప డకండ్లకు చెందిన చిరంజీవి(25) ఆత్మహత్య ఘటన కంటతడి పెట్టిస్తోంది.పుట్టుకతోనే మెద డు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అత డిని బతికించేందుకు తల్లిదండ్రులు లక్షలు ఖ ర్చు చేశారు.అయితే తన వల్ల కుటుంబానికి భారమేనని భావించిన చిరంజీవి...చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆ త్మహత్య చేసుకున్నాడు."ఉరిశిక్ష పడిన వారికి కూడా చివరి కోరిక ఇస్తారు.అలాగే నాకూ ఓ కోరిక ఉంది.నా చివరి కోరిక తీర్చండి.నేను చ నిపోయాక నా శవాన్ని కుక్కలకు ఆహారంగా వేయండి.లేకపోతే ఎక్కడైనా చెత్త కుప్పలోనై నా పడేయండి.నా శవాన్ని అమ్మానాన్నలకు ఇ వ్వొద్దు.నా శవాన్ని చూసి వారు తట్టుకోలేరు. వారి ఆవేదన,బాధ నేను ఊహించలేను.ఇక సె లవు.." అంటూ రాసిన సూసైడ్ నోట్ కంట నీ రు తెప్పించింది.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment