క్రీడా స్ఫూర్తితో యువతరం రాణించాలి... అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి క్యారమ్స్ పోటీలు...మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి...
క్రీడా స్ఫూర్తితో యువతరం రాణించాలి
అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి క్యారమ్స్ పోటీలు
మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి
క్రీడా స్ఫూర్తితో యువతరం క్రీడా రంగంలో రా ణించాలని మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రె డ్డి అన్నారు.మంగళవారం కర్నూలు నగరంలో ని యునైటెడ్ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి క్యా రమ్ పోటీలను క్లబ్ అధ్యక్షులు భీమేశ్వర్ రెడ్డి, కార్యదర్శి బలరామ్,గేమ్స్ సెక్రటరీ చెన్నకేశవ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సం దర్భంగా మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యు వతరం డిజిటల్ మత్తును వీడి క్యారమ్స్ సాధ న వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆటో విడుపు కోసం కాకుండా క్యారమ్స్ క్రీడ ను ప్రొఫెషనల్గా ఆడితే మంచి ఉద్యోగ అవకా శాలు పొందవచ్చు అన్నారు.అనంతరం క్లబ్ అ ధ్యక్ష,కార్యదర్శులు భీమేశ్వర్ రెడ్డి,బాలరామ్ లు మాట్లాడుతూ క్రమశిక్షణతో అంకితభావం తో ప్రతిరోజు క్యారమ్స్ సాధన చేయాలని సూ చించారు.వివిధ ప్రాంతాల నుంచి సింగిల్స్ వి భాగంలో 70మంది పేర్ల ను నమోదు చేసుకు న్నారని,డబల్ ఎంట్రీ 40టీములు వచ్చాయని తెలిపారు.ఈ పోటీలు వారం రోజులపాటు క్లబ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కా ర్యక్రమంలో క్లబ్ సభ్యులు కాశీ రత్నమయ్య, సునీల్ కుమార్,వి.శేష్,క్రీడా సంఘాల ప్రతిని ధులు చిన్న సుంకన్న,అవినాష్ శెట్టిలు పాల్గొ న్నారు.
Comments
Post a Comment