అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలులో వైస్సార్సీపీ ధర్నా...కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఆపాలని నేతల డిమాండ్...
అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలులో వైస్సార్సీపీ ధర్నా
కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఆపాలని నేతల డిమాండ్
రెడ్బుక్ రాజకీయాలతో వైస్సార్సీపీని అణగ దొక్కలేరని హెచ్చరిక
బాలుని ఘటనపై ప్రభుత్వ తీరును ఖండించి న నాయకులు
కర్నూలులో వైస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు,అరెస్టులు చేస్తున్నారంటూ వైస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.కర్నూ లు యువజన విభాగ నాయకుడు బాలునిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా, పోలీసుల బెదిరింపులకు భయపడి అతను ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని నాయకు లు ఆరోపించారు.ఇటీవల ఓ యువకుడు తన సూసైడ్ నోట్లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడి పేరు ను ప్రస్తావించినప్పటికీ ఇప్ప టివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని,అయితే అదే విషయం పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వైస్సార్సీ పీ కార్యకర్త సన నరసింహను తెల్లవారుజా మున అరెస్ట్ చేశారని విమర్శించారు.ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే తప్పుడు కేసులు న మోదు చేస్తూ,పోలీసులను అడ్డుపెట్టుకొని టీ డీపీ ప్రభుత్వం వైస్సార్సీపీ శ్రేణులను అణగదొ క్కాలని చూస్తోందని ఆరోపిస్తూ కర్నూలులో వై స్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి వై స్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు జ క్కంపూడి రాజా,జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి,రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, డా.ఆదిమూ లపు సతీష్,చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి,అహ్మద్ అలీ ఖాన్,కాటసాని ఓబుల్ రెడ్డి,బుట్టా ప్రతూల్ తహాజరై మాట్లాడారు.కూటమి ప్రభుత్వం వై స్సార్సీపీ నాయకులను ఎంత అణగదొ క్కాల ని ప్రయత్నించినా,అంతకంతకూ మరింత బ లంగా ఎదుగుతామని ఈ సందర్బంగా నేతలు హెచ్చరించారు.
Comments
Post a Comment