కల్లూరు వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వా లి...పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరి త రెడ్డి...
కల్లూరు వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి
పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరి తరెడ్డి
నగర పరిధిలో ఉన్న కల్లూరు వార్డుల అ భివృ ద్ధికి నగరపాలక అధికారులు ప్రత్యేక ప్రాధాన్య త ఇవ్వాలని పాణ్యం నియోజ కవర్గ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి సూచించారు.శనివారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి నగరపాలక అధికా రులతో సమావేశం నిర్వహించారు.కల్లూరు వా ర్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పను లు, పెండింగ్ సమస్యలు,ప్రజల అవసరాలపై సమ గ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వార్డుల వారీగా కాకుండా జ నాభా ప్రాతిపదికన నిధులను కేటాయించడం ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక వసతు లు సమర్థ వంతంగా అందించవచ్చని పేర్కొ న్నారు.పార్కు స్థలాలకు ఫెన్సింగ్ వేసి వాటిని ప రిరక్షించాల్సిన అవసరం ఉందని,340 సి ర హదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే చెక్పోస్ట్ నుం డి సఫా కళాశాల వైపునకు నగరపాలక పరిధి లో వరకు డ్రైన్ నిర్మా ణానికి తక్షణమే నిధు లు కేటాయించాలని సూచించారు.శంకుస్థాప న చేసిన అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి చేయాలని,తాగునీటి సమస్య ను శాశ్వతంగా పరిష్కరించి ప్రతిరోజూ నీటి స రఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించాల ని అధికారులను ఆదేశించారు.వేసవి దృష్ట్యా బోర్లు మరమ్మత్తులు చేపట్టాలన్నారు.అదేవి ధంగా అధ్వానంగా ఉన్న రహదారులపై కనీ సం గ్రావెల్ రోడ్లు నిర్మించి ప్రజలకు ఇబ్బందు లు లేకుండా చూడాలని తెలిపారు.విద్యుత్ దీ పాల మరమత్తులు,స్తంభాల మార్పునకు చర్య లు తీసుకోవాలని సూచించారు.కల్లూరు వార్డు ల్లో సమస్యలు అధికంగా ఉన్నందున అధికా రులు ప్రత్యేక దృష్టి సారించాలని,ప్రజలకు మె రుగైన మౌలిక సదుపాయాలు అందించేందు కు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే గౌరు చరి తరెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అద నపు కమిషనర్ ఆర్జివి కృష్ణ,డిప్యూటీ కమిష నర్ సతీష్ కుమార్ రెడ్డి,కార్యదర్శి నాగరాజు, మేనేజర్,ఆర్వో జూనైద్,ఇంచార్జీ సిటీ ప్లానర్ వై.వి.వెంకటరమణ,ఎస్ ఈ రమణమూర్తి,ప్ర జారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment