అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇ ప్పించండి...అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇ ప్పించండి
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
అవసరమైన రంగాల్లోనే నిరుద్యోగ యువ త కు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారు లను ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్ లో బుధవారం జిల్లాలోని నైపుణ్య అభివృద్ధి అధికారులతో పాటు సంబంధిత శా ఖ అధికారులతో జిల్లా నైపుణ్య అభివృద్ధి అభి వృద్ధి కమిటీ మొదటి సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.సంబంధిత శాఖ అధికారులు వారి పరిధిలో ఉండే నిరుద్యోగులకు జాబ్ మేళాల వివరాలు తెలియ జేయాలన్నారు.అ దేవిధంగా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవ సాయ,సోలార్ పంప్ టెక్నీషియన్,డ్రోన్ పైలెట్స్, ప్రకృతి వ్యవసాయం,నిర్మాణరంగం వంటి వా టిలో యువతకు శిక్షణ ఇప్పించాల్సిన ఆవశ్య కతను తెలియజేశారు.జిల్లా నైపుణ్య అభివృ ద్ధి కమిటీలో ఉన్న వివిధ శాఖలకు చెందిన 19 మంది సభ్యులు సమన్వయంతో నిరుద్యోగు లకు మంచి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు క ల్పించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబా బు,సీడాప్ జీడిఎం శ్రీనివాసులు,జిల్లా మైనింగ్ అధికారి రవిప్రసాద్,మెప్మా సీఎంఎం ఎలీషా బాబు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment