జర్నలిస్టులకు టోపీలు పంపిణీ...
జర్నలిస్టులకు టోపీలు పంపిణీ
మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, యూనియన్ నాయకులకు ఏపీ యూడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావుతో కలసి డాక్టర్ వసీం శనివారం టోపీలు పంపిణీ చేశా రు.ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ...వా ర్తల సేకరణలో జర్నలిస్టులు నిత్యం బిజీగా ఉంటారన్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల కనీ స జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదన్నారు. ప్రధానంగా ఎండాకాలం ఎండలు మండు తు న్నాయని,తలమీద ఎలాంటి రక్షణ లేకుండా జర్నలిస్టులు క్రయాణిస్తున్నారని ఈ క్రమంలో కొందరు వడదెబ్బకు గురై ప్రాణాల మీదకు తె చ్చుకుంటున్నారని చెప్పారు.అలా కాకుండా ఎండకు వెళ్ళేట ప్పుడు టోపీలు ధరించాలని సూచించారు.జర్నలిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తమ ఆసుపత్రి తరుపున టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.చివరిగా ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐ జేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్ని కైన ఈ.ఎన్.రాజును రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు,జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ జా తీయ కార్యవర్గ సభ్యులు,జిల్లా అధ్యక్షులు ఈ. ఎన్.రాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్య క్షులు జీ.కొండప్ప,ఐజేయూ జాతీయ సమితి సభ్యులు ఎన్.వెంకట సుబ్బయ్య,కే.నాగరా జు,ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ గౌడ్,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంక న్న,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అం జి,రాష్ట్ర సమితి సభ్యులు భాష్యం మధు,జి ల్లా సహాయ కార్యదర్శులు శివరాజ్ కుమార్, అవినాష్,నాయకులు మల్లి,హరి,రమేష్,ఏపీ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్య క్షులు రఫీ,జిల్లా అధ్యక్షులు సుధాకర్,తదితరు లు పాల్గొన్నారు.
Comments
Post a Comment