భాజపా 'విజయ'దుందుభి...కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు...బాణసంచా మోత, మిఠాయిల పంపిణీ...
భాజపా 'విజయ'దుందుభి:
కర్నూలులో కదం తొక్కిన కమల శ్రేణులు
బాణసంచా మోత,మిఠాయిల పంపిణీ
దేశ రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాజపా ప్రభంజనం సృష్టించడంతో కర్నూలు జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.సో మవారం కల్లూరు మండలం ప్రధాన కూడలి వద్ద భాజపా శ్రేణులు నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి.బాణసంచా పేలుళ్లు,మో దీ నినాదాలతో కల్లూరు వీధులు మార్మోగా యి.ఈ విజయోత్సవ సభలో పార్టీ ముఖ్య నా యకులు మాట్లాడుతూ ప్రత్యర్థులపై విరుచు కుపడ్డారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 20 5 స్థానాల భారీ మెజారిటీతో మమతా కోటను బద్దలుకొట్టి,అధి కారాన్ని కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు.అ స్సాంలో హ్యాట్రిక్ విజయం,పుదుచ్చేరిలో వరు సగా రెండోసారి అధికారం చేపట్టడం ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజలు నీరాజనాలు ప డుతున్నారనడానికి నిదర్శనమన్నారు."ఇది ఆరంభం మాత్రమే...రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక వంటి దక్షిణాది రా ష్ట్రాల్లోనూ భాజపా జైత్రయాత్ర కొనసాగుతుం ది...డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సా ధ్యమని ప్రజలు నమ్ముతున్నారు" అని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.ఎస్.నాగరాజు యాద వ్,కన్వీనర్ ముద్దిగట్టి రెడ్డిపాల్,జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు మద్దిలేటి యాదవ్,మాజీ ఉపాధ్యక్షులు తాశంత్ కుమా ర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి రమణి యాదవ్,కిసాన్ మోర్చా నేత ప్రవీణ్ ఆచారి,జిల్లా కార్యవర్గ స భ్యులు రవి శేఖర్,మోహన్ రావు,ఓబీసీ మం డల అధ్యక్షులు వన్నె యాదవ్,శేఖర్ ఆచారి,ఓ బీసీ నేతలు భాస్కర్, విశ్వం,ఓబీసీ మోర్చా నాయకులు డి.చంద్రశేఖర్,తిరుపతి,రవికు మార్,మధుసూదన్ రావు,కల్లూరు మండల ప్ర ధాన కార్యదర్శి నాగేంద్రుడు ఆధ్వర్యంలో జరి గిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర ఆచారి,నా గభూషణం,పి.వెంకటేశ్వర రెడ్డి,తదితర నాయ కులు,వందలాది మంది కార్యకర్తలు పాల్గొని విజయ సంబరాల్లో పాలుపంచుకున్నారు.
Comments
Post a Comment