పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు...మనస్థాపంతో కూతురు ఆత్మహత్య...
పరీక్ష సమయంలో టీవీ చూడొద్దని కూతురుని మందలించిన తల్లితండ్రులు
మనస్థాపంతో కూతురు ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా,జన్నారంలో పరీక్ష స మ యంలో టీవీ ఎందుకు చూస్తున్నావని తల్లిదం డ్రులు మందలిచ్చారు.దీంతో క్షణికావేశానికి గురైన ఆ విద్యార్థిని పురుగు మందుతాగగా చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటన జన్నారం మండలం,రోటిగూడ గ్రామంలో చో టు చేసుకుంది.జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన మోత్కూ రి లక్ష్మీ నారాయణ గౌడ్-పద్మ దంపతుల చిన్న కూతురు మోత్కూరి అక్షయ(19) లక్షెట్టి పేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవ త్సరం చదువుతోంది.వార్షిక పరీక్షలు జరుగు తున్నందున టీవీ చూడటం ఆపేసి చదువుకో వాలని ఈ నెల 3న తల్లిదండ్రులు మందలిం చారు.చదువుకోమని చెప్పి టీవీ ఆఫ్ చేసి వా ళ్లిద్దరూ పనులకు వెళ్లారు.క్షణికావేశంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను జ న్నారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కరీంనగర్ తరలిం చారు.చికిత్స పొందుతూ గత గురువారం అ క్షయ మృతి చెందింది.ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొ న్నారు.
Comments
Post a Comment