కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు... సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష...
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయంపై కర్నూలులో కాంగ్రెస్ సంబరాలు
సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ విజయంపై కర్నూలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు సో మవారం కర్నూలు జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,అడ్వకేట్ క్రాంతి నాయుడు బోయ సూచన మేరకు సిటీ కాంగ్రె స్ అధ్యక్షులు షేక్.జిలాని భాష ఆధ్వర్యంలో సం బరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా నా యకులు,కార్యకర్తలు కేక్ కట్ చేసి,స్వీట్లు పం చుకుని సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్బం గా జిలాని బాషా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో గెలుపోటములు సహజమని,భవిష్యత్ ఎన్నికల్లో ప్రజలకు మరింత చేరువ కావడానికి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ నాయ కత్వంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయ న స్పష్టం చేశారు.అలాగే బిజెపి పతనం ప్రారం భమైందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ డిసిసి అధ్యక్షులు కే.బాబురా వు,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు బి.బతుక న్న,ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఎన్.సి.బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డి.వి.సాంబశివుడు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మీసాల సుమలత,ఐఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్,48వ వార్డు ఇన్చార్జి షేక్ షబ్బీర్,తది తరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment