విజయ్ సీఎం ప్రమాణం...తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది...
విజయ్ సీఎం ప్రమాణం...తమిళనాడులో కొత్త రాజకీయ యుగానికి నాంది
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘ ట్టం ఆవిష్కృతమైంది.ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి.జోసె ఫ్ విజయ్ ఆదివారం ఉదయం 10-00 గంట లకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఘ నంగా బాధ్యతలు స్వీకరించారు.గవర్నర్ ఆ ర్.ఎన్.అర్లేకర్ విజయ్తో ప్రమాణం చేయిం చారు.భారీ భద్రత మధ్య జరిగిన ఈ కార్యక్ర మానికి రాజకీయ,సినీ,వ్యాపార రంగాలకు చెం దిన ప్రముఖులు,వేలాది మంది అభిమానులు హాజరయ్యారు.దశాబ్దాలుగా తమిళనాడు రా జకీయాలను ప్రభావితం చేసిన డిఎంకె,ఎఐడి ఎంకె పార్టీల ఆధి పత్యానికి చెక్ పెడుతూ టీ వీకె పార్టీ అధికారంలోకి రావడం రాష్ట్ర రాజకీ యాల్లో సంచలనంగా మారింది.ఇటీవల జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకె పార్టీ ఘన విజ యం సాధించగా,మిత్రపక్షాల మద్దతుతో విజ య్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు.రాష్ట్ర రాజ కీయాల్లో కొత్త శకానికి ఇది నాంది పలికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రా యపడుతున్నా రు.బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం విజయ్ ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తి ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రగ్స్ నిరోధక బృందాన్ని ఏర్పాటు చేస్తూ తొలి నిర్ణయం తీ సుకున్నారు.యువతను డ్రగ్స్ బారిన పడకుం డా కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటా మని ప్రభుత్వం స్పష్టం చేసింది.మహిళల భద్ర తకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నా రు.ఈ పథకం వల్ల లక్షలాది మహిళలకు ప్ర యోజనం కలగనుంది.విజయ్తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి లోక్సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీతోపాటు సినీ,రాజ కీయ ప్రముఖులు హాజర య్యారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం విజయ్ భావోద్వేగ వ్యా ఖ్యలు చేశారు.“నేను మీ ఇం ట్లో ఒక కుటుంబ సభ్యుడిని.మీకు అన్నగా,త మ్ము డిగా ఉంటాను.నాకు ఆకలి తెలుసు...పే దరికం తెలుసు” అంటూ ప్రజలతో తన అను బంధాన్ని వ్యక్తం చేశారు.యువత,రైతులు,మ హిళలు,పేదల అభివృద్ధే తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు.అవినీతి ర హిత పాలన,ఉపాధి అవకాశాల పెంపు,సంక్షే మ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తా మని వెల్లడించారు.విజయ్ అధికారంలోకి రా వడంతో తమిళనాడులో కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకె కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటుండగా,సోషల్ మీడియాలో కూ డా సీఎం విజయ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్గా మారింది.
Comments
Post a Comment