ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు...సెప్టెం బర్లో నోటిఫికేషన్...వార్డుల విభజన,బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం...ఎన్నికల ఏర్పా ట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా...
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు...సెప్టెం బర్లో నోటిఫికేషన్
వార్డుల విభజన,బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం
ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీ క్షించిన ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స న్నాహాలు ప్రారంభించింది.ప్రస్తుత పాలకవర్గా ల పదవీకాలం ముగియ నుండటంతో,సెప్టెంబ ర్లో ఎన్నికల నోటిఫి కేషన్ జారీ చేసి,డిసెంబ ర్ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.కొత్త ఏడాదికి నూతన పా లకవర్గాలు కొలువుదీరేలా చర్యలు చేపడుతోం ది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం అమరావ తిలో కీలక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశానికి పంచాయతీ రా జ్,గ్రామీణాభివృద్ధి, మున్సిపల్,బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు,కమిషనర్లు హాజ రయ్యారు.ఎన్నికల ఏర్పాట్లు,వార్డుల పునర్వి భజన,రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ఆ యన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చే శారు.ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు,డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని,ఇది జూన్,26 నాటికి పూర్తికానుందని అధికారులు తెలిపారు.మరో వైపు,బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను జూ న్లో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా జులైలో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు.ఇప్పటికే రాష్ట్రంలోని 13,29 పంచాయతీలకు ఓటర్ల జాబితాలు ప్ర చురించినట్టు సమాచారం.ఈ ఏర్పాట్లన్నీ స కాలంలో పూర్తి చేసి,షెడ్యూల్ ప్రకారం ఎన్నిక లు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది.
Comments
Post a Comment