కమర్షియల్ గ్యాస్ పై పెంచిన ధరలు ఉపసం హరించుకోవాలి...సిపిఐ ధర్నా...
కమర్షియల్ గ్యాస్ పై పెంచిన ధరలు ఉప సంహరించుకోవాలి
సిపిఐ ధర్నా
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సి. మహేష్ అధ్యక్షత న ధర్నా చేపట్టారు.ఈ సంద ర్బంగా సిపిఐ సీనియర్ నాయకులు మనోహర్ మాణి క్యం,నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కా ర్యద ర్శి పి.శ్రావణి రెడ్డిలు మాట్లాడుతూ భారతదే శంలోని ప్రజలను మోసం చేయడంలో భారతీ య జనతా పార్టీకి మించిన పార్టీ మరొకటి లేదని ఎన్నికల ముందర ఒక మాట,ఎన్నికల తర్వాత మరొక మాట మాట్లాడడం బిజెపి ప్ర భుత్వానికి చెల్లు అన్నారు.నరేంద్ర మోడీ,అమి త్ షా ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఎ ట్టి పరిస్థితుల్లో గ్యాస్,పెట్రోలు,డీజీలు ధరలు పెంచబోమని,అది ప్రభుత్వ భరిస్తుందని ప్రజ లను నమ్మబలికి ఓట్లు వేయించుకున్న మరు సటి రోజున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లపై రూ960 పెంచడం చాలా దారుణమని మండి పడ్డారు.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిపై పట్టణాలకు వెళ్లి నప్పుడు హోటళ్లకు వెళ్లి టిఫి న్,భోజనం చేయాలన్న కూడా వాటిపైన హోట ల్ యజమానులు పెంచిన రేట్లతో తినే పదార్థా లపై భారం పడుతుందని చెప్పారు.తద్వారా పేద,మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందుల కు గురవుతారని,ఇప్పటికే రోజురోజుకు పెరిగి పోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో కొన లేక ఇబ్బందులు పడుతుంటే,మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మరల గ్యాస్ ధరలు పెం చడం ద్వారా ప్రజలు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉన్నదని అన్నారు.తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని,పె ట్రోలు,డీజిల్ పై ధరలు పెంచాలనే ఆలోచన విరమించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ న గర సహాయ కార్యదర్శి దంభోలం శ్రీనివాసరా వు,నగర కార్య వర్గ సభ్యులు నాగరాజు,బీస న్న,అన్వర్, నల్లన్న,సురేష్,రాముడు,ప్రసాద్, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment