మాజీ డీజీపీ భార్య దారుణ హత్య...
మాజీ డీజీపీ భార్య దారుణ హత్య
హైదరాబాద్ నగరం నడిఒడ్డున్న ఉన్న జూబ్లీ హిల్స్ శుక్రవారం తెల్లవారు జామున దారుణ ఘటన వెలుగు చూసింది.ఐఏ ఎస్ ఐపీఎస్ క్వార్టర్స్లో మాజీ ఐపీ ఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద తన నివాసం లోనే దారుణ హత్యకు గురయ్యారు.ఈ ఘ టన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.సమా చారంతో ఘటనా స్థ లానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు.క్లూస్ టీమ్ సహాయంలో ఘటనా స్థలం లోని వేలిముద్రల సేకరించారు.అయితే ఈ దారుణానికి,పాల్పడింది,నేపాలి గ్యాంగ్ అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సైబ రాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడిం చారు.ఇంట్లో పని మనిషి కల్పన అనే నేపా ల్కు చెందిన మహిళ గత ఎనిమిది నెలలుగా ఇంట్లో పని చే స్తుందని...ఆమె పథకం ప్రకారం మరి కొందరితో కలిసి సునందను హత్య చేసి నట్టు పోలీసులు గుర్తించారు.సునంధ ఇంట్లో ఒం టరిగా ఉన్న సమయం చూసి కల్పన తమ గ్యాంగ్కు సమాచారం ఇచ్చిందని...దీంతో అ క్కడికి చేరుకున్న నలుగురి వ్యక్తులతో కలిసి సునందను హత్య చేశారని,అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం తీసుకొని అక్కడి నుం చి పారిపోయారని పోలీసులు ప్రాథమికంగా ని ర్థారణకు వచ్చారు.నిందితులను త్వరగా ప ట్టుకు నేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Comments
Post a Comment