పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్ప వు...ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించం డి...క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి...చల్లా ఓబులేసు,నగరపాలక సంస్థ కమిషనర్...
పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్ప వు
ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి
క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి
చల్లా ఓబులేసు,నగరపాలక సంస్థ కమిషనర్
నగరంలో ప్రతి శానిటేషన్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని,మార్పు కనబడ కపోతే సంబంధిత శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు,కా ర్యదర్శులపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించా రు.
సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాల నీలోని నగరపాలక సమావేశ భవనంలో పారి శుద్ధ్య పర్య వేక్షక సిబ్బందితో సమావేశం నిర్వ హించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ...తాను ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్య టిస్తూ,లోపాలను సరిచేసుకునేందుకు దిశా ని ర్దేశం చేస్తుంటే వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రద్ధతో విధులను నిర్వ ర్తించాలని,క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగాల ని సూచించారు.తిరిగినప్పుడే సమస్యలు సు లువుగా అర్థం అవుతుందన్నారు.ప్రతి వాహ నానికి వెళ్ళాల్సిన మార్గాన్ని మ్యాపింగ్ చే యాలని,ఆ విషయాన్ని డ్రైవర్కి,పారి శుద్ధ్య సి బ్బందికి,ప్రజలకు స్పష్టం తెలియజేయాలని ఆ దేశించారు.ప్రతిరోజూ రెండు ఖాళీ స్థలాల్లో,పె ద్ద డ్రైనేజీ కాలువల్లో,ట్రాన్స్ ఫార్మర్ల వద్ద స్వ చ్ఛత పనులు చేపట్టాలని ఆదేశించారు.కూడ ళ్ళు,డివైడర్ల ప్రతిరోజూ తనిఖీ చేయాలన్నా రు.ప్రతి దుకాణం వద్ద డస్ట్బిన్లు ఉండేలా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్ర మంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు,కార్యదర్శులు,తదిత రులు పాల్గొన్నారు.
Comments
Post a Comment