Posts

ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం...

Image
ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆం దోళన వ్యక్తమవుతోంది.స్మార్ట్ మీటర్ల బిగింపుతో ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం ఉంద ని,వాడినా వాడకపోయినా బిల్లులు పడతాయనే భావన సాధారణ ప్రజల్లో ఉంది.ఈ నేప థ్యంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఇళ్లకు వస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని పలు చోట్ల అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది.విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మం త్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు.ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీ టర్లు బిగించవద్దని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.పారిశ్రామిక,వ్యాపార సంస్థలకు మా త్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని సూచించారు.వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని కూడా మరోసారి స్పష్టం చేశారు.స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లే నిపోని అపోహలు సృష్టిస్తున్నారని,స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి గ...

రంగారెడ్డి జిల్లాలో దారుణం...మరో పరువు హత్య...

Image
రంగారెడ్డి జిల్లాలో దారుణం మరో పరువు హత్య ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు VS9TV న్యూస్,రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా,కొత్తూరు మండలం,పెంజర్ల గ్రామంలో ఒక దారుణ ఘటన చోటుచేసు కుంది.ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహి త్ (20),తన అక్క రుచిత (21) మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చే శాడు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల కథనం ప్రకారం...గ్రామాని కి చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్,సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు,ఒక కుమా రుడు ఉన్నారు.వారి పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ పూర్తి చేసి,ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదు రుచూస్తోంది.అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం నడు స్తోంది.ఈ విషయంపై గతంలో కుటుంబంలో గొడవలు జరిగాయి,పంచాయితీ కూడా జ రిగింది.అప్పుడు రుచిత,ఆ యువకుడు ఇకపై మాట్లాడుకోబోమని చెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.అయితే, కొంతకాలం నుంచి రుచిత మళ్లీ తన ప్రియుడితో ఫోన్‌లో సంభాషణలు మొదలుపెట్టింది.ఈ విషయంపై తమ్ముడు రోహిత్ ఆమెను పదేపదే మందలిస్తూ వచ్చాడు.నిన్న తల్లిదండ్రులు పనుల కోసం బయటకు వెళ్లగా,ఇంట్లో రు...

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...18మంది మృతి...

Image
జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...18మంది మృతి  VS9TV న్యూస్,హైదరాబాద్ : జార్ఖండ్‌లోని డియోఘర్‌,జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టడంతో 18మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గా యపడ్డారు.మంగళవారం తెల్లవారు జామున,4:30 గంటల సమయంలో మోహన్‌ పూ ర్,పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి ప్రాంతంలో కన్వర్ యాత్రకు వెళ్తున్న బ స్సు,గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో మృతుల మృతదేహాలను పోస్ట్‌ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఈ సంఘటన గురించి మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ప్రియరంజన్‌కు సమాచారం అందించారు.ఆ తర్వాత ప్రియరంజన్ కుమార్ ఒక బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని,మోహన్‌పూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు సమాచారం అందించా రు.సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా మోహన్‌పూర్ సిహెచ్‌సికి పంపారు.ఈ ప్రమాదంపై ఎంపీ నిషికాంత్ దూబే విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు...

Image
తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులు VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నలుగురు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదుల కోటాలో గౌస్‌ మీరా మొహియుద్దీన్‌, సుద్దాల చలపతిరావు,వాకిటి రామ కృష్ణారెడ్డి,గాడి ప్రవీణ్‌కుమార్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరిం చనున్నారు.హైకోర్టు న్యాయవాదులుగా ఉన్న వీరిని అదనపు జడ్జిలుగా నియమించాలం టూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశా రు.దీంతో ఈ నలుగు రు అదనపు న్యాయమూర్తుల నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.హైకోర్టులో మొత్తం ఉండాల్సిన న్యాయమూర్తుల సంఖ్య 42కాగా ప్రస్తుతం 26మంది పనిచేస్తున్నారు.కొత్తగా నలుగురు న్యాయమూర్తుల చేరికతో ఈ సంఖ్య 30కి చేరనుంది. వీరిలో గౌస్ మీరా మొహీ యొద్దీన్,చలపతిరావు సుద్దాల,వాకిటి రామకృష్ణారెడ్డి,ప్రవీణ్ కుమార్ లు అదనపు న్యాయమూర్తులుగా నియమి తులయ్యారు.

న్యూయార్క్‌లో కాల్పుల కలకలం...ఐదుగురు మృతి...

Image
న్యూయార్క్‌లో కాల్పుల కలకలం...ఐదుగురు మృతి VS9TV న్యూస్,హైదరాబాద్ : అమెరికాలోని న్యూయార్క్‌లో కాల్పుల కలకలం రేపింది.మన్‌హట్టన్‌లో అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు.ఓ గుర్తుతెలియని దుండగుడు భవనంలోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం వినగానే భయాందో ళనకు గురైన స్థానికులు భవనాల నుంచి పరుగులు తీశారు.ఘటనాస్థలికి చేరుకున్న పో లీసులు దర్యాప్తు ప్రారంభించారు.దుండగుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

బిచ్చగాళ్ల “వీర్యం”...అడ్డాకూలీల “అండం”... పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు...

Image
బిచ్చగాళ్ల “వీర్యం”...అడ్డాకూలీల “అండం” వీర్యం,అండాల దందాలో వికృత పార్శ్వాలు చదువురానివారికైతే...బిర్యానీ పొట్లం, మందు బాటిల్ విద్యావంతులకు రూ.4వేల వరకు చెల్లించి వీర్యం సేకరణ అండ దానం చేసే మహిళలకు రూ.20-రూ.25 వేలు పోలీసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : వీర్యం,అండాల సేకరణ పేరుతో నగరంలో జరుగుతున్న వికృత దందా ఇది.సంతాన భా గ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాల వంటివి కోరుకునేవారు.ఆ దాతలు బాగా చదు వుకున్నవారై,మంచి తెలివితేటలు కలిగినవారై ఉండాలని భావిస్తారు.కానీ...ఈ దందా న డిపేవారు వారికి అంటగడుతున్నది బిచ్చగాళ్లు,అడ్డాకూలీల వీర్యాన్ని,అండాలను.'ఇండి యన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్' పేరుతో సికింద్రాబాద్ లో ఈ దందా నడుపుతున్న ఏ డుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.దీనిపై లోతైన దర్యాప్తు చేయగా విస్తు పోయే విషయాలు వెలుగుచూశాయి.ఈ క్లినిక్ యజమాని, మేనేజర్ గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా,టెక్నీషియన్లుగా నియమించుకున్నా డు.వారు..బిచ్చగాళ్లకు,అడ్డాకూలీల వంటివారికి డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు....

ఏపీలో ఆటో డ్రైవర్ లకు తీపి కబురు... రూ.10 వేలు అర్థక సహాయం....మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన...

Image
ఏపీలో ఆటో డ్రైవర్ లకు తీపి కబురు రూ.10 వేలు అర్థక సహాయం  మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన VS9TV న్యూస్,శ్రీకాకుళం : ఏపీలోని ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది.రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లకు రూ. 10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.ఈ విషయాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు,శ్రీకాకుళం జిల్లా,పలాసలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి...అన్నదాత సుఖీ భవ పథకం తొలి విడత నిధులను త్వరలోనే రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామ న్నారు.రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు.అలాగే రాష్ట్రంలోని ప్రతి ఆటో డ్రైవర్‌కు కూడా త్వరలోనే రూ. 10వేలు అందిస్తామని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం లో ఏపీకి పెట్టుబడులు తరలివస్తున్నాయన్న కొల్లు రవీంద్ర...ఇప్పటి వరకూ పది లక్షల కో ట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు.మరోవైపు మహిళల కోసం ఆగస్ట్,15వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించనున్న సంగతి తెలి సిందే.సూపర్ సిక్స్ హామీలలో మాట ఇచ...

ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న 81,82 సచివాలయాలు ఖాళీ చేయాలి...టి.రాముడు,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి...

Image
ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహిస్తున్న  81,82 సచివాలయాలు ఖాళీ చేయాలి టి.రాముడు,సిపిఎం పార్టీ నగర కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరం,32వ వార్డు ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న 81,82స చివాలయాలను ఖాళీ చేయాలని ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్యక్రమంలో నగర పా లక సంస్థ కమీషనర్ పి విశ్వనాథ్ ని కలిసి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి.రాముడు కా ర్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె.సుధాకరప్ప,ఆర్. నరసింహులు,జి.ఏసులు కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముజ ఫర్ నగర్ లో ఉన్న నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాలు చుట్టుపక్కల వున్న ప్రాంతా లలోని ప్రజలకు వివాహాలు,ఫంక్షన్లు చేసుకోవడానికి పొదుపు గ్రూపుల సమావేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని,అలాంటిది అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో ఉన్న కమిషనర్ సచివాలయాల కోసం కేటాయించాలని ఒత్తిడి చేసిన కారణంగా ఆరు నెలలలో ఖాళీ చేస్తామని అప్పటి కమిషనర్ రాతపూర్వక హామీ మేరకు సచివాలయాల కు కేటాయించినట్లు చెప్పారు.దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఖాళీ చేయకపోవడం వల్ల,ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవా...

విద్యా సంస్ధల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు డ్రోన్,శక్తి టీమ్ ల నిఘా తో పటిష్ట చర్యలు....

Image
విద్యా సంస్ధల వద్ద యాంటీ ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నివారణకు  డ్రోన్,శక్తి టీమ్ ల నిఘా తో పటిష్ట చర్యలు మహిళల భద్రతకు మేమున్నామంటూ  భరోసా కల్పిస్తున్న కర్నూలు పోలీసులు విద్యార్థుల్లో భద్రతాభావం పెరిగే విధంగా పటిష్ట చర్యలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలోని ఆర్ ఎస్ రోడ్డు లో ఉన్న కెవిఆర్ కళాశాల,మౌర్యన్ దగ్గర ఉన్న చైత న్య కళాశాలల సమీపంలో ఆకతాయిల ఆటకట్టించేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో శక్తీ టీం పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. సోమవారం శక్తి టీమ్ సిఐ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బాలికలు,మహిళలకు భద్రతపై భ రోసా కల్పిస్తూ అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ ఈవ్ టీజింగ్ కు పాల్పడే వా రిపై దృష్టి సారించారు.పాఠశాలలు,కళాశాలల వద్ద ఈవ్ టీజింగ్,ర్యాగింగ్ వంటి సంఘ టనలు ఎదుర్కొనకుండా ఉండేందుకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.విద్యార్థుల్లో భద్రతాభావం పెరిగే విధంగా పటిష్ట చర్యలు చేపట్టారు.మహిళలను,అమ్మాయిలను వేధిం చే ఆకతాయిలను, అనుమానితులను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి,వారిని అదుపులోకి తీసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టార...

సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై సుమోటో కేసు నమోదు...

Image
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై సుమోటో కేసు నమోదు VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఘటనపై రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) సుమోటో కేసు నమోదు చేసింది.వచ్చే నెల 28లోగా సమగ్ర నివేదిక సమ ర్పించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా జ్యోతిబాపూలే సంక్షేమ హాస్టల్ లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపైనా కేసు నమోదు చేసింది.ఆగస్ట్,28లోగా రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C S)ని ఆదేశించింది.

భారతదేశంలోనే అత్యంత మహిళా ధనవంతురాలు...

Image
భారతదేశంలోనే అత్యంత మహిళా ధనవంతురాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : వంద రూపాయలు ఇతరులకు సహాయం చేసినా వారు ఫోటోలు దిగి మీడియాలో, సో షల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు.కానీ రోషిణి నాడార్ మాత్రం వేలాది మందికి ల క్షలాది రూపాయలు సాయం చేసినా కూడా...తన నుండి సహాయం పొందిన వాళ్ళు పె ద్ద నాయకులు కావాలి...పెద్ద పెద్ద సంస్థల్లో లీడర్లుగా ఎదగాలి...భారతదేశాన్ని ముందుం డి నడిపించాలి...అప్పుడు తానే వెళ్ళి వాళ్ళతో ఫోటోస్ దిగుతాను అంటుంది.ఎంత గొ ప్ప వ్యక్తిత్వం...ఈ నేపథ్యంలో రోషిణి నాడార్ ''VS9TV'' ప్రత్యేక స్టోరీ... భారతదేశం లో అత్యంత మహిళా ధనవంతురాలు రోషిణి నాడార్.ఈమె ప్రత్యేకత అంతేనా అంటే కాదు.ఇంకా చాలానే ఉంది.ఇటీవలే HCL పగ్గాలు చేపట్టిన రోషిణి నాడార్ 2017 నుంచి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100మంది మహిళల్లో ఒకరు.ప్రస్తుతం భార తదేశ చరిత్రలో ఒక మహిళ,ఒక ఐటీ కంపనీ పగ్గాలు చేపట్టి చైర్మన్ అవడం ఇదే తొలి సారి.HCL (హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్) ని స్థాపించిన శివ నాడార్ ఏకైక కు మార్తె రోషిణి.తండ్రి చాటు బిడ్డ.ఎక్కడికి వెళ్ళినా తండ్రితోనే వెళ్తుంది.తండ్రి మాట జవ దాటదు.కానీ తానే సొంతం...

కాలేజీ అభివృద్ధి అందరి సహకారంతోనే సాధ్యం...డాక్టర్ పి.చంద్రశేఖర్,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్...

Image
కాలేజీ అభివృద్ధి అందరి సహకారంతోనే సాధ్యం డాక్టర్ పి.చంద్రశేఖర్,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కాలేజీ అభివృద్ధి అందరి సహకారంతోనే సాధ్యం అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్  లర్ డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు.సోమవారం కర్నూలు మెడికల్ కాలేజ్ ని సం దర్శించిన సందర్భంగా ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి అందరూ దూరదృష్టిలో ఆలోచించి సహకరించాలని ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు.వైఎస్ ఛాన్సలర్ గా వున్నందున ప్రభు త్వ ఉన్నత అధికారులతో మాట్లాడి అభివృద్ధి కి సహకరించే అవకాశం వుందని,ఈ కళా శాల విద్యార్థిగా ఆసుపత్రి సూపర్డెంట్ గా,కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసిన అభిమానం తో కాలేజి అబివృద్దికి మరింత సహకారం అందిస్తారని కోరారు.ఇందుకు హాస్పిటల్ వై ద్యులు,కాలేజి,వైద్యులు విద్యార్థులు అందరూ కలిసి కట్టుగా సమన్వయం ముందుకి వస్తే పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ డా క్టర్ హరిచరణ్,సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు,వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, డాక్టర...

బాబు షూరిటీ మోసం గ్యారెంటీ...కల్ల బొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం...ఎస్.వి.మోహన్ రెడ్డి,వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు...

Image
బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కల్ల బొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయింది ఎస్.వి.మోహన్ రెడ్డి,వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి,ఉమ్మడి క ర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు విజయ మనోజ్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు.ఈ సందర్భం గా ఎస్.వి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి మీ భవిష్యత్తుకు నేను గ్యారెంటీ అని చెప్పి చిట్ట చివరకు వారికి మోసం మాత్రం తప్పక చేస్తానని మరొక సారి చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారని విమర్శించారు.ప్రజా క్షేత్రంలో ఎవరై నా సరే ప్రజలకు సేవ చేయాలని,తపన పడతారని అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ప్ర జలకు మోసం చేస్తుంది ఆయన విమర్శించారు.ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సంక్షే మం కొరకు వైఎస్ఆర్సిపి పార్టీ ముందు ఉంటుందని ఆయన తెలిపారు.ఎస్.వి.విజయ మ నోహరి మాట్లాడుతూ ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి రూ.1500 చెల్లిస్తానని,ఉచిత బస్సు ప్ర యాణం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు ఎ...

హీరో అమీర్ ఖాన్ ఇంటికి 25మంది ఐపిఎస్ లు...

Image
హీరో అమీర్ ఖాన్ ఇంటికి 25 మంది ఐపిఎస్ లు  VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రస్తుతం ఐపీఎస్ ట్రైనీలో ఉన్నవారు ఆమిర్ ఖాన్ ను కలవాలని అభ్యర్థించారని దీంతో వారిని నటుడు స్వయంగా ఇంటికి పిలిచి అతిథ్యం ఇచ్చినట్లు అమీర్ ఖాన్ టీం తెలిపారు. గతంలోనూ ఆమిర్ ఇలా ఎన్నోసార్లు చేశారని చెప్పారు.1999లో విడుదలైన సర్ఫ్రోష్ చి త్రంలో ఆమిర్ పోలీస్ అధికారిగా నటించారు.ఆ చిత్రం తర్వాత ఎంతోమంది ఐపీఎస్ అ ధికారులు ఆయనకు అభిమానులుగా మారారని టీమ్ సభ్యుడు వెల్లడించారు.అప్పటి నుం చి ఇలా అతిథ్యం ఇస్తున్నారని తెలిపారు.

నిన్ను రేప్ చేసి చంపేస్తాం...నటి రమ్యపై హీరో దర్శన్ ఫ్యాన్స్ వేధింపులు...

Image
నిన్ను రేప్ చేసి చంపేస్తాం...నటి రమ్యపై హీరో దర్శన్ ఫ్యాన్స్ వేధింపులు VS9TV న్యూస్,హైదరాబాద్ : సినీ నటి రమ్యను రేప్ చేసి చం పేస్తామని హీరో దర్శన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న వేధింపుల పట్ల సీ పీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆమె తెలిపారు.నటి పవిత్ర గౌడపై అస భ్యకర వ్యాఖ్యలు చేశాడని రేణు కాస్వామి అనే ఫ్యాన్ని హత్య చే సిన కేసులో హీరో దర్శన్ ను పో లీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.అయితే దర్శన్ ఫ్యాన్స్ తనను కూడా వేధిం చారని...రేణుకాస్వామికి,దర్శన్ ఫ్యాన్స్ కు ఎలాంటి తేడా లేదని రమ్య పేర్కొంది.దీంతో రేణుకాస్వామి బదులు నువ్వు చనిపోవాల్సిందని,నిన్ను రేప్ చేసి చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా నటి రమ్యను దర్శన్ ఫ్యాన్స్ వేధిస్తున్నట్టు తెలుస్తోంది.

తన కంటే 18ఏళ్లు పెద్దవాడితో నటి సహజీవనం...సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్...

Image
తన కంటే 18ఏళ్లు పెద్దవాడితో నటి సహజీవనం సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన గ్లామర్ హీరోయిన్ పదేళ్లుగా సినిమాల్లో యాక్ట్ చేయడం లేదు.ఎందుకంటే తనకంటే 18 ఏళ్లు పెద్దవాడైన ఓ విలన్ పాత్రలు చేసే నటుడితో సహ జీవనం చేస్తోంది.ఆ స్టార్ హీరోయిన్ వివరాలు...ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ లాం టి స్టార్ హీరోయిన్స్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ నటి 2015 నుండి సినిమాల్లో న టించడం లేదు.అయితే ఈ నటి తన ప్రేమ వ్యవహారం కారణంగా వార్తల్లో నిలిచింది.ఈ నటి తన కంటే 18 సంవత్సరాలు పెద్దవాడైన హీరో కమ్ విలన్‌తో లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌ లో నివసిస్తోంది.ఆ హీరో కూడా అజిత్ సినిమాలో విలన్.అతని మొదటి భార్య మరణిం చినప్పుడు ఆమె కంటే 18 సంవత్సరాలు చిన్నది.ఆమె చాలా కాలంగా లైవ్-ఇన్ రిలేష న్‌షిప్‌లో ఉంది.ఆ నటి పేరు ముగ్ధా గాడ్సే.నేటి తరం సినీ అభిమానులకు ముగ్ధా గాడ్సే గు రించి తెలియదు.2015 తర్వాత ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు. ప్రియాంక చోప్రా,కంగనా రనౌత్‌లతో కలిసి 2008లో 'ఫ్యాషన్' మూవీలో ముగ్ధా గా డ్సే అరంగేట్రం చేసింది.ఫ్యాషన్ (2008) హీరోయిన్ (2012) ...

అందంతో మురిపించే స్టార్ ల జీవితం ఆనందంగా ఉండదు...

Image
అందంతో మురిపించే స్టార్ ల జీవితం ఆనందంగా ఉండదు VS9TV న్యూస్,హైదరాబాద్ : తమ స్టైల్ తో అందంతో మురిపించే స్టార్ ల జీవితం మనం అనుకున్నంత ఆనందంగా ఉండదు.వాళ్లకు ఎన్ని శారీరిక సమస్యలు ఉన్నా పైకి నవ్వుతూ మేక్ అప్ చాటున ఏడు స్తూ మనల్ని మురిపిస్తారు.అలాంటి వారిలో పలువురు ప్రముఖ హీరోలు సైతం ఉన్నారు. వారిలో... సల్మాన్ ఖాన్ కు (58) ఏళ్ళు అయి పెళ్ళికాకుండా వున్నాడు.గతంలో ఎందరి తోనో వున్న ఈ వ్యక్తి ఇపుడు ఒంటరిగా జీవిస్తూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధ లు బయట పెట్టుకున్నాడు.తనకు నరాల సంబంధ వ్యాధులు ఉన్నట్లు గుర్తించి వైద్యానికి వెళ్లగా తలలో రక్త నాళాలు వాచి ఉన్నట్లు వైద్యానికి కూడా లొంగక ఎపుడు చిట్లుతాయో తెలియని స్థితి.ముఖ కండరాలు వాచి విపరీతంగా నొప్పి నిద్రలేమితో అల్లాడుతూ నరకం చూస్తున్నాను అని చెప్పుకువచ్చాడు. సమంత విషయానికి వస్తే తను చాలా కాలం నుండి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లు దాని వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి తేలికగా అలసిపోవడం కళ్ళు తిరగడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.ఇది జీవన విధానం మార్చుకుంటే కొంత కంట్రోల్ చేసుకోవచ్చు తప్ప మం దుల ద్వారా తగ్గే వ్యా...

నెల్లూరులో మరో దారుణం...ఇంటికి పిలిచి ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు...

Image
నెల్లూరులో మరో దారుణం... ఇంటికి పిలిచి ప్రియుడిని  హత్య చేసిన ప్రియురాలు VS9TV న్యూస్,నెల్లూరు : వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు.ఈ అక్రమ సంబంధాలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి.తాజాగా నెల్లూ రులో మరో దారుణం చోటు చేసుకోంది.ఇంటికి ప్రియుడిని పిలిచి మరీ లేపేసింది ఓ ప్రి యురాలు...పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పె ళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే తరుణ్ కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ప్రవళిక సంచలన ఆరోపణలు : ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిచింది.కానీ అదే ఇంట్లో తరుణ్ తే జ్ హత్యకు గురయ్యాడు.దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేసిం ది.తన భర్తను మాధవితో పాటుగా మరికొందరు కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులుకు ఫిర్యాదు చేసింది.ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.ఈ ఘట నకు సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోకండి...విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ...

Image
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోకండి పోటి పరీక్షల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇస్తామని చెప్పే  వ్యక్తులను ఎవ్వరిని నమ్మవద్దు...మోసపోవద్దు విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 104 ఫిర్యాదులు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కా ర్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యా ది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 104 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులు : 1) తన కుమారుడు తన బాగోగులు చూడడం లేదని కర్నూలు,ఇందిరా గాంధీ నగర్ కు చెందిన రంగలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. 2) కర్నూలుకు చెందిన వీరస్వామి నా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాన...

నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్ పైన చర్యలు తీసుకోండి...డివైఎఫ్ ఐ...

Image
నాణ్యత, పరిశుభ్రం పాటించని హోటల్స్ పైన చర్యలు తీసుకోండి డివైఎఫ్ ఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా వ్యాప్తంగా సరైన నాణ్యత అందించకుండా,పరిశుభ్రత పాటించకుండా ప్ర జల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా కలెక్టర్ రంజిత్ భాషకి విజ్ఞప్తి చేశారు.సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ బృందం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు రాఘవేంద్ర,అబ్దుల్లా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హోటల్ నిర్వాహకులు సరైన శుభ్రత నాణ్యత పాటించకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని తెలియ చేశారు.జిల్లా వ్యాప్తంగా చాలా మంది ప్రజలు గ్యాస్ట్రిక్ అల్సర్ ఇతర అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు అని అన్నారు.డాక్టర్లు సైతం హోటల్స్ లో చేసే భోజనాలు ఆరోగ్యా నికి మంచివి కాదని అంటున్నట్టు తెలియజేశారు.అలాగే ధరలు పెరుగుతున్నాయని సా కు చెప్పి విపరీతమైన ధరలు పెంచి ప్రజల కష్టాన్ని కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటు న్నారని అన్నారు.ఒక్కో హోటల్లో ఒక్కో ...

కిరాణా వ్యాపారాల్లో రాబోతున్న మరొక మార్పు...ఇప్పటికే కార్పొరేట్ వ్యాపారస్తుల వల్ల చిన్న వ్యాపారులు కుదేలు...

Image
కిరాణా వ్యాపారాల్లో రాబోతున్న మరొక మార్పు ఇప్పటికే కార్పొరేట్ వ్యాపారస్తుల వల్ల చిన్న వ్యాపారులు కుదేలు  కొత్తగా ఇంకొకటి వస్తుంది VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : చిన్న వ్యాపారులు కూడా ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం కావడం లేదా సొంతంగా చిన్నపాటి డెలివరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వంటివి చేయాలి.డిజి టల్ చెల్లింపు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడం చాలా ముఖ్యం.తమ పరిసరా ల్లోని కస్టమర్లకు వేగంగా డెలివరీ సేవలు అందించడం ద్వారా పెద్ద కంపెనీలతో పోటీ పడ వచ్చు. పాత తరం దుకాణాలకు ఉన్న నమ్మకాన్ని నిలుపుకోవడం చాలా అవసరం. చిన్న వ్యాపా రులకు ప్రభుత్వం లేదా వ్యాపార సంఘాల నుండి మద్దతు కూడా అవసరం.వారికి సాం కేతిక పరిజ్ఞానాన్ని అందించడం,ఆర్థిక సహాయం చేయడం  ఇంటి వద్దకే కిరాణా సామా గ్రిని ఆర్డర్ చేసి తెప్పించుకోవడానికి అలవాటు పడుతున్నారు.ఇది చిన్న దుకాణాలకు వ చ్చే కస్టమర్ల సంఖ్యను తగ్గిస్తుంది. పెద్ద సూపర్ మార్కెట్లు,ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు చేస్తు న్నాయి.భవిష్యత్ లో ఇలాంటి మొబైల్ కిరణం వాహనం ప్రసిద్ధి చెందే అవకాశం లేకపో లేదు.ఇది వారికి మరింత సమర్థవంతంగా పని...

ధర్మస్థల హత్యోదంత ఘటనల దర్యాప్తును వేగవంతం చేయాలి...నిందితులను అరెస్టు చేసి కటినంగా శిక్షించాలి...

Image
ధర్మస్థల హత్యోదంత ఘటనల దర్యాప్తును వేగవంతం చేయాలి నిందితులను అరెస్టు చేసి కటినంగా శిక్షించాలి ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ ఐడబ్ల్యూ డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :  కర్ణాటక రాష్ట్రం,మంజునాథ దేవాలయం ధర్మస్థలంలో గత వారం రోజులుగా వెలుగులోకి వస్తున్న వందలాది మంది యువతులు,మహిళలపై దారుణమైన అత్యాచారం,హత్యోదం తం ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆవేధనను,ఆందోళనను కల్గిస్తున్నాయినీ, ఈ హత్యోదంత ఘటనలపై సమగ్ర దర్యాప్తును జరిపి దోషులను కటినంగా శిక్షించాలని ఆంధ్రపదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐడబ్ల్యూ) డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూ లు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర సమితి పిలుపు మేరకు మహిళా సమాఖ్య నగర అ ధ్యక్షురాలు నాగేంద్రమ్మ అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఏ పి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ,జిల్లా ఉపాధ్యక్షురాలు రేణుక,నగర కార్య దర్శి వి.భారతిలు మాట్లాడుతూ ఈ హత్యోదంత పరంపర మనసును కలిచి వేస్తుంద ని,ఆశ్రమాల పేరుతో,ఆలయాల పేరుతో,ఆధ్యాత్మిక చింతన పేరుతో,భక్తి పేరుతో మహిళ లను వంచిస్తూ, సమాజంలో పెద్ద మనుషులుగా మతగురువులుగా,చెలామణి అవుతూ మ హిళల మాన ప్ర...

దేవస్థాన నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు...వెంకయ్య నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి...

Image
దేవస్థాన నిధులు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు వెంకయ్య నాయుడు,మాజీ ఉపరాష్ట్రపతి VS9TV న్యూస్,తిరుమల : తిరుమల శ్రీవారిని మాజీ ఉపరా ష్ట్రపతి వెంకయ్య నాయుడు సో మవారం కుటుంబ సభ్యులతో క లిసి దర్శించుకున్నారు.అనంత రం ఆయన మాట్లాడుతూ...ప్ర జాప్రతినిధులు,వీఐపీల శ్రీవారి ద ర్శనాలపై కీలక వ్యాఖ్యలు చేశా రు.ప్రపంచంలో హిందువులకు స్ఫూర్తి కేంద్రం తిరుమల.భక్తులు సమర్పించే కానుకలను ధార్మిక,ఆధ్యాత్మిక కార్యక్రమాల కు,భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలని అన్నారు.ప్రభుత్వం రాజకీ య జోక్యం చేసుకోకుండా ఉండాలన్నారు.ప్రతి ఊరిలో గుడి కట్టడా నికి టీటీడీ ముందు కు రావాలని కోరారు.గుడి,బడి లేని ఊరు ఉండకూడదు.బడి కట్టించడం ప్రభుత్వ కర్త వ్యం.గుడి కట్టించడం దేవస్థానాల ప్రధాన కర్తవ్యం కావాలని సూచించారు.దేవస్థానం ని ధులు ప్రభుత్వ కార్యక్ర మాలకు, ఇతరత్రాలకు ఖర్చు పెట్టకూడదు.కేవలం దేవాలయం అభి వృద్ధి,భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మాత్రమే వినియోగించాలి అన్నారు.ప్రజా ప్రతి నిధులు,వీఐపీలు ఏడాదిలో ఒకేసారి దర్శనానికి రావాలి.వీఐపీలు తమవారిని పరిమితం గా దర్శనానికి తీసుకురావాలి.అలాచేస్తే సామాన్య భక...

చిల్లి చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకాలు...

Image
చిల్లి చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్మకాలు VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రస్తుతం సమాజంలో కొందరికి చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగదు వారంలో ప్రతిరోజు పెట్టిన చికెన్ తింటుంటారు.చికెన్ తో తయా రు చేసే వివిధ వెరైటీలను ఇండ్ల లోను రెస్టారెంట్లో తింటూనే ఉం టాం.చికెన్ వంటకాలు అంటే ప డి చచ్చే వారికి నిజంగానే ఇది షాకింగ్ న్యూస్...ఎందుకంటే చి కెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్నారు కొందరు రెస్టారెంట్ లు.ఫాస్ట్ ఫుడ్ సెంట ర్లకు చికెన్ కు బదులు గబ్బిలాల మాంసాన్ని పంపుతున్నారని తెలిసింది.ఈ షాకింగ్ ఘట న తమిళనాడులో వెలుగు చూసింది.గబ్బిలాలను వేటాడి చికెన్ అని చెప్పి అమ్ముతున్న ఇ ద్దరు వ్యక్తులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిసిన వి వరాల ప్రకారం...తమిళనాడు రాష్ట్రంలోని డానిష్ పేట పరిధిలోని తోప్పూర్ రామస్వామి కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని డానిష్‌ పేట అ టవీ కార్యాలయానికి సమాచారం అందింది.దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్‌కుమార్ నేతృ త్వంలోని అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు.నిజంగానే అక్కడ తుపాకీ కాల్పుల శబ్దాలు వారికి వినిపించాయి.ద...

ఓరి మీ దుంపలు తెగ...మరీ ఇంత పిచ్చా... సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం...

Image
ఓరి మీ దుంపలు తెగ...మరీ ఇంత పిచ్చా సెల్ఫీ మోజులో జలపాతంలో కొట్టుకుపోయిన కుటుంబం ఝార్ఖండ్‌లోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద ఘటన పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కుటుంబం మునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన స్థానికులు VS9TV న్యూస్,హైదరాబాద్ : సెల్ఫీ మోజులో ఓ కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది.ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ స మీపంలోని ప్రసిద్ధ భటిండా జలపాతం వద్ద నిన్న జరిగిందీ ఘటన.పశ్చిమ బెంగాల్‌లోని పూర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు జలపా తాన్ని సందర్శించారు.అక్కడ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటి ప్రవా హంలో కొట్టుకుపోయారు.అప్రమత్తమైన స్థానికులు,మత్స్యకారులు వెంటనే స్పందించ డంతో పెను ప్రమాదం తప్పింది.సాక్షుల కథనం ప్రకారం...భటిండా జలపాతం వద్ద వే గంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహం సమీపంలో సెల్ఫీలు తీసుకునేందుకు బాధిత కుటుం బం ప్రయత్నించింది.ఈ క్రమంలో కుటుంబంలోని ఒక మహిళ అకస్మాత్తుగా కాలు జారి నీటిలో పడిపోయింది.వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త,కొడుకు, కూతురు ఆమెను రక్షిం చేందుకు వెంటనే నీటిలోకి దూకారు.అయితే జలపాతం వద్ద ఉన్న బలమైన ప్రవాహం కా రణంగా నలుగురూ మ...

శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో సర్పపూజలు... ప్రత్యక్షమైన భారీ నాగుపాము...

Image
శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో సర్పపూజలు ప్రత్యక్షమైన భారీ నాగుపాము VS9TV న్యూస్,తిరుపతి : తిరుపతి జిల్లాలోని పవిత్రమైన శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో చాలా మంది భక్తులు వెళ్లి రాహు,కేతు దోషాలకు పూజలు చేయించుకుంటారు.ముఖ్యంగా ఇక్కడకు వచ్చి రాహు, కేతు దోషాలకు నివారణ పూజలు చేయించుకుంటే వెంటనే దాని రిజల్ట్ పాజిటివ్ గా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.శ్రీ కాళ హస్తిశ్వర స్వామి అంటే..శివుడితో పాటు, అక్కడ సుబ్రహ్మణ్యుడు యదార్థంగా వెలిశారని భక్తులు నమ్ముతుంటారు.అందుకే శ్రీకాళ హస్తిశ్వర స్వామి ఆలయంకు వచ్చి ప్రతిరోజున వేలాది మంది రాహు,కేతు దోషాల పరి హారల కోసం పూజలు చేయించుకుంటారు.ఈ క్రమంలో గ్రహాణాల సమయంలో కూడా దేశంలోని అన్ని ఆలయాలు క్లోజ్ చేస్తే...శ్రీకాళహస్తిశ్వర స్వామి ఆలయం మాత్రం క్లోజ్ చేయరు.ఈ క్రమంలో ఇలాంటి పవిత్రమైన ఆలయంలో రాహు కేతు దోషాల కోసం భ క్తులు పూజలుచేసుకుంటుండగా...భారీ సర్పం ప్రత్యక్షమైంది.దీంతో అక్కడున్న భక్తులు భయంతో పరుగులు తీశారు.శ్రీకాళహస్తి ఆలయంలో రూ.750 టికెట్టు కొనుగోలు చేసి రాహు కేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద...ఏకంగా భారీ నాగు పాము హల్చల్ చేసింది.ఈ క్రమంలో భక్తులు భ...

స్టీల్ ప్లాంట్ జీఎం ఇంట్లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం...

Image
స్టీల్ ప్లాంట్ జీఎం ఇంట్లో భారీగా విదేశీ మద్యం స్వాధీనం VS9TV న్యూస్, విశాఖపట్నం : విశాఖపట్నం,స్టీల్‌ప్లాంటులో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌ ఇంట్లో భారీగా విదేశీ మద్యంతోపాటు డిఫెన్స్‌,ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పీఎం పాలెంలోని ఎంవీవీ సిటీలో ఫ్లాట్‌ నంబర్‌ 80 88లో విదేశీ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ ముసలనాయుడు బృందం సోదాలు చేపట్టారు.ఆయన ఇంట్లో 18 విదేశీ,16 డిఫెన్స్‌,ఒ డిశా,గోవా మద్యం సీసాలు ఒక్కొక్కటి,తెలంగాణ మద్యం సీసాలు 11,హరియాణ రాష్ట్ర మద్యం బాటిళ్లు ఏడు,మహారాష్ట్రకు చెందినవి రెండు స్వాధీనం చేసుకున్నారు.రవికుమా ర్‌ పరారీలో ఉండడంతో ఎక్సైజ్‌ పోలీసులు గాలిస్తున్నారు.

హరిద్వార్‌లోని ఆలయంలో తొక్కిసలాట... ఆరుగురి మృతి...

Image
హరిద్వార్‌లోని ఆలయంలో తొక్కిసలాట ఆరుగురి మృతి VS9TV న్యూస్,ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రం,హరిద్వార్‌ లోని మన్సాదేవి ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుం ది.ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో...తొక్కిస లాట జరిగింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడి నట్లు గర్హ్వాల్‌ కమిషనర్‌ వినయ్ శంకర్ పాండే వెల్లడించారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని...ఆలయం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నా యని తెలిపారు.విద్యుత్ షాక్ కారణంగా భయభ్రాంతులకు గురైన భక్తులు ఒక్కసారిగా ప రుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నట్లు గర్హ్వాల్ కమిషనర్ తెలిపారు.విద్యుత్‌ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నా రు.ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.ఇది బాధాకరమైన విషయమని...ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఘటనకు గల కా రణాలపై దర్యాప్తు కొనసాగుతోందని...అధికారులతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు...

కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు...రేవంత్ రెడ్డి...

Image
కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ కొ త్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాల్లోని అర్హు లను గుర్తించిన ప్రభుత్వం...వారికి కొత్త కార్డులు పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టింది. తా జా...రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీలను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది.రాష్ట్రంలో కొత్తగా పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పథకాలు అం దించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది.ప్రతి పథకంతోపాటు ఆరోగ్యశ్రీ కింద చికిత్స కు కూడా రేషన్ కార్డు తప్పని సరి కావడంతో కొత్తగా కార్డులు పొందుతున్న వారికి ప్రభు త్వ పథకాలు అందేలా యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం రెడీ చేస్తుంది, రాష్ట్రంలో ఇంతకు ముందు 9.10లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా.. 2.84కోట్ల మంది వివిధ స్కీమ్ ల కింద లబ్ధిదారులుగా ఉన్నారు.అయితే, ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్తగా 3.50 లక్షల కుపైగా రేషన్ కార్డుల...

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం...రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల...

Image
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల VS9TV న్యూస్,శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో మరో గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం రెండు గేట్ల ద్వారా నీటిని నాగార్జున సాగ ర్‌కు విడుదల చేశారు.జూరాల,సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,27,392 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.శ్రీశైలం నుంచి ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులు. రెం డు స్పిల్‌వే గేట్ల ద్వారా 53,764 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.పోతిరెడ్డిపాడు హె డ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు,ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35, 315 క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కులు విడుదల చే స్తున్నారు.శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం 882.40 అ డుగులకు చేరింది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కా గా...ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా నమోదైంది.

తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్...మరో ఇద్దరితో ఐశ్వర్య ఎఫైర్‌...

Image
తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్  మరో ఇద్దరితో ఐశ్వర్య ఎఫైర్‌ VS9TV న్యూస్,గద్వాల : గద్వాల నవ వరుడు తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు తిరు మల రావుతోనే కాకుండా మరో ఇద్దరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు వె ల్లడించారు.ఐశ్వర్య బలవంతం చేయడంతోనే తిరుమల రావు సుపారీ గ్యాంగ్‌తో తేజేశ్వ ర్‌ను హత్య చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భర్త హత్యకు భార్య కుట్ర...పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితుడు...

Image
భర్త హత్యకు భార్య కుట్ర పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితుడు VS9TV న్యూస్,బాచుపల్లి :  హైదరాబాద్,బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి,నిజాంపేట్ ఏరియాలో దారుణం జరిగింది. వనపర్తి జిల్లా,పెద్దగూడెం, తండాకు చెందిన నానావత్ రాందాస్...భార్య జ్యోతితో ని జాంపేటలో నివాసం ఉంటున్నారు.వీరిద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవడంతో భర్తను హ త్య చేయడానికి ప్రణాళిక చేసింది.ఓ వ్యక్తి రాందాస్‌ను తీసుకొని మద్యం తాగించి బీర్ బాటిల్‌తో హత్యాయత్నం చేశారు.చనిపోయాడకున్న ఆ వ్యక్తి అక్కడినుంచి వెళ్ళిపో గా...రాందాస్ స్పృహలోకి వచ్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు.పోలీసులు దర్యా ప్తు ప్రారంభించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జ‌గ‌న్ అరెస్ట్ అంత తేలిక కాదు ?

Image
జ‌గ‌న్ అరెస్ట్ అంత తేలిక కాదు ? VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో 13మందిని అరెస్టు చేశారు.వీరిలో రాజంపేట ఎంపీ,వైసిపి కీలక నాయకుడు మిథున్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్ దగ్గర పనిచేసిన ఓఎస్ డిలు పార్టీ నాయకులు కూడా ఉన్నారు.మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని కూడా ప్రత్యేక దర్యా ప్తు బృందం అధికారులు అరెస్ట్ చేశారు.ఇక ఇప్పుడు ఈ కేసును మరింత లోతుగా విచా రించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ పరిణామాలు ఎలా ఉన్నా...ఈ కేసులో ప్ర ధానంగా జగన్ ను అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.ఈ విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికే అనేక కథనాలు వార్తలు కూడా వచ్చాయి.అయితే ఇతర వ్యక్తులను లేదా ఇతర వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినంత ఈజీగా జగన్‌ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. దీనికి అనేక రాజకీయ కారణాలు...ప్రజల్లో ఏర్పడే సింప‌తీ వంటి కారణాలు కూడా కనిపి స్తున్నాయి.ప్రజల్లో సింప‌తీపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఇప్పుడు ఉన్న పరిస్థితు లు జగన...

మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి... ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే...

Image
మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే VS9TV న్యూస్,న్యూఢిల్లీ : ఆరోగ్య కారణాలతో ఉప రాష్ట్రపతి పదవికి జూలై,21న జగ్‌దీప్ ధన్‌ఖఢ్ రాజీనామా చేసి నప్పటికీ ఆయన రాజీనామాకు కారణాలపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.దీ నిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి,జగ్‌దీప్ ధన్‌ఖడ్‌కూ మధ్య అంశమని అన్నారు. అసలైన కారణం ఏమిటనే దానిపై తనకు సమాచారం లేదని చెప్పారు.రైతులకు అనుకూలంగా మాట్లాడి నందుకే ధన్‌ఖడ్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందా అని మీడియా అడిగిన ప్ర శ్నకు ఖర్గే స్పందిస్తూ ఆ విషయాలు తనకు తెలియవని,ఆయన ఎప్పుడూ ప్రభుత్వం పక్షా నే ఉండేవారని,అసలు ఏమి జరిగిందనేది ఆయనే చెప్పాలని అన్నారు.రాజ్యసభ చైర్మన్‌ గా జగ్‌దీప్ ధన్‌ఖడ్ తన హయాంలో ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవార ని,కీలక అంశాలను లేవనెత్తేందుకు విపక్షాలకు తరచు అనుమతి నిరాకరించేవారని ఖర్గే వ్యాఖ్యానించారు.రైతులు,పేదలు,అంతర్జాతీయ అంశాలు,విదేశాంగ విధానం వంటి ప లు అంశాలపై ఏరోజూ రాజ్యసభ చైర్మన్‌గా ఆయన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేద ని విమర్శించారు.దళిత ...

బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు...విద్యార్థినులకు అస్వస్థత...తల్లిదండ్రుల ఆందోళన...

Image
బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు విద్యార్థినులకు అస్వస్థత తల్లిదండ్రుల ఆందోళన VS9TV న్యూస్,తిరుపతి : తిరుపతి జిల్లా,కోట మండలంలోని జడ్పీ హైస్కూల్ బాలికల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.యూనిఫామ్ లేకుండా స్కూల్‌కు వచ్చారనే చిన్న కారణంతో క్రీడా ఉ పాధ్యాయుడు సుబాన్ దుర్మార్గంగా ప్రవర్తించారు.సుమారు పదిమంది విద్యార్థినిలను లై న్లలో నిలబెట్టి గుంజిళ్లు తీయిస్తూ శారీరక శిక్ష విధించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది .ఈ ఘటనతో విద్యార్థినుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. శారీరకంగా తట్టుకోలేక పదిమందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే సిబ్బంది సహాయం తో బాధిత విద్యార్థినులను కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.బాధితులందరూ స్థానిక ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థినులే కావడం గమనా ర్హం.ఈ అంశం కులపరమైన కోణంలోనూ చర్చనీయాంశమవుతోంది.ఈ సమాచారం తె లిసిన వెంటనే విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ఆం దోళనకు దిగారు. "మా పిల్లలపై ఎందుకు ఇలా అనుచితంగా ప్రవర్తించారు?", "ఇది చ దివించే గురువు ప్రవర్తనా?"...

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిఎస్పీ పార్థివ దేహానికి ఘన నివాళులు...చదలవాడ నాగరాణి,జిల్లా కలెక్టర్...అద్నాన్ నయీం అస్మి,జిల్లా ఎస్పీ...

Image
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిఎస్పీ  పార్థివ దేహానికి ఘన నివాళులు చదలవాడ నాగరాణి,జిల్లా కలెక్టర్ అద్నాన్ నయీం అస్మి,జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,పాలకొల్లు : తెలంగాణ,యాదాద్రి జిల్లాలో గత శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డీఎస్పీ మే క చక్రధర్ రావు పార్థివ దేహం వారి స్వగృహానికి ఆదివారం పాలకొల్లు పట్టణం చేరుకుం ది.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి,జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మేక చక్రధర్ రావులు డీఎస్పీ మేక చక్రధర్ రావు పార్థివ దేహంపై పుష్ప గుచ్చాలను ఉం చి నివాళులర్పించి సంతాపాన్ని తెలియజేశారు.ఈ సందర్బంగా వారి సతీమణిని,కుటుం బ సభ్యులను పరామర్శించి ఓదార్చి,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అనంతరం జి ల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా మేక చక్రధర్ రావు కు టుంబానికి అండగా ఉంటామని తెలిపారు. డీఎస్పీ మేక చక్రధర్ రావు జీవన విశేషాలు : ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో డీఎస్పీగా పనిచేస్తున్న చక్రధరరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా,పాలకొల్లు కాగా భార్య,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.వీరు 1996 లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోలీ...