రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్ బానోత్ దుర్గా ప్రసాద్....
రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టెక్నికల్ అసిస్టెంట్ బానోత్ దుర్గా ప్రసాద్ VS9TV న్యూస్,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా,కన్నెపల్లి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి కార్యాలయంలో పని చేస్తున్న పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి విభాగానికి చెందిన టెక్నికల్ అసిస్టెంట్ బా నోత్ దుర్గా ప్రసాద్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల బారిన పడ్డాడు.వివరాలు ఇలా ఉన్నాయి... ఫిర్యాదుదారుడు MGNREGS కింద ని ర్మించబడిన పశువుల కొట్టానికి సంబంధించి కొలతలను కొలతల పుస్తకంలో నమోదు చేయించేందుకు మరియు పెండింగ్లో ఉన్న బిల్లును మంజూరు చేయించేందుకు అధికా రిక సహాయం కోసం వెళ్లగా,ఇందుకోసం రూ.10వేలు లంచం డిమాండ్ చేసినట్లు సమా చారం ఫిర్యాదు మేరకు అనిశా అధికారులు ఏర్పాటు చేసిన ఉచ్చులో నిందితుడు లంచం స్వీకరిస్తున్న సమయంలోనే పట్టుబడినట్టు వెల్లడించారు. ప్రజలకు అనిశా విజ్ఞప్తి : ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే,ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించవలసిందిగా అధికారులు విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా, ఫి ర్యాదు దారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయ...