Posts

కంచ గచ్చిబౌలిలో పచ్చదనాన్ని పునరుద్ధరి స్తారా ? లేక జైలుకెళ్తారా?...సుప్రీం కోర్ట్...

Image
VS9TV న్యూస్,న్యూ ఢిల్లీ : హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో రాష్ట్ర ప్రభుత్వం చెట్లు కొట్టేసే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.దీనితో ఏప్రిల్‌,3న సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది.ఈ అంశంపై సుప్రీం ఆదేశాల మేరకు…263 పేజీలతో కూడిన సుదీర్ఘ అఫిడవిట్‌ను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది.సుమోటో కేసుతో పాటే బీ ద చేంజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ సైతం దాఖలు చేసిన పిటిషన్లపై గత బుధవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయి,జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మాసి్‌హలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘కంచగచ్చి బౌలిలోని వందెకరాలను పునరుద్ధరిస్తారా ? లేక జైలుకెళతారా?’’ అంటూ అధికారులను సూటిగా ప్రశ్నించింది.చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని హెచ్చరించింది.కంచ గచ్చిబౌలిలో చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా? లేదా? అనే ప్రశ్నకు సూటిగా జవాబివ్వాలని నిలదీసింది. ‘‘మీరు పెద్దఎత్తున చెట్లను కొట్టివేస్తే…ఆవాసం కోసం జంతువులు పరుగులు తీశాయి.వాటిన...

గోల్డ్‌ టైమ్‌...ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధర...

Image
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : గోల్డ్‌ టైమ్‌ నడుస్తోంది.ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఒకటే మాట...బంగారం ధర లక్ష రూపాయలకు పోతుందట కదా అనే మాటే వినిపిస్తోంది.ఈ టైమ్‌లో బంగారాన్ని కొనడమే కాదు...అమ్మడం కూడా ఎక్కువగానే జరుగుతోంది...లక్ష దిశగా పరుగులు పెడుతోంది బంగారం ధర.మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ పాత రికార్డులను బద్దలు గొడుతూ జెట్‌ స్పీడ్‌గా దూసుకుపోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఇప్పుడు చూస్తున్నాం.లక్ష రూపాయల దిశగా కంటిన్యూ అవుతోంది గోల్డ్‌ రన్‌.ఆల్‌టైమ్‌ హైలో బంగారం ధరలు ఉన్నాయి.గత బుధవారం నాటికీ పోలిస్తే పది గ్రామాల బంగారం ధర రూ.710 పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98380వేలకు చేరుకుంది.లక్షకు కేవలం 1620 రూపాయల దూరంలో ఉంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.91,110కు చేరుకుంది.

వివాదంలో టీవీకే పార్టీ చీఫ్….నటుడు విజయ్‌కు ఫత్వా జారీ...

Image
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : టీవీకే స్థాపకుడు,నటుడు దళపతి విజయ్ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది.మద్యం సేవించేవారిని,జూదగాళ్లను ఇఫ్తార్ విందుకు పిలిచి చట్టవిరుద్దంగా ప్రవర్తించారని..దీనితో పాటు రంజాన్‌ పవిత్రతను దెబ్బతీసేలా చేశారని ఫత్వాలో ఎఐఎంజె అధ్యక్షులు మౌలానా ముఫ్తీ షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు.విజయ్ నటించిన చిత్రాల్లో ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరించారని..ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టినందున..ఓట్ల కోసం ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని రజ్వీ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.ఇఫ్తార్ విందుకు జూదగాళ్లను ఆహ్వానించడంతో తమిళనాడులోని సున్నీ ముస్లింలు అతనిపై కోపంగా ఉన్నారని అన్నారు.వారి కోరిక మేరకే ఫత్వా జారీ చేసినట్లు చెప్పారు.సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మాట్లాడుతూ నటుడు విజయ్ మార్చి,8న చెన్నైలోని వైఎంసిఎ మైదానంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు.ఆయన తలకు టోపీ ధరించి,వారితో కలిసి ఉపవాసం విరమించారు.అయితే విజయ్ ఇఫ్తార్ విందును సరిగ్గా నిర్వహించలేదని, ఇఫ్తార్‌తో సంబంధం లేని వ్యక్తులు అక్కడికి పిలిచి మ...

రేషన్ బియ్యం అక్రమ గోదాములపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మెరుపు దాడి...500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సిజ్...

Image
VS9TV న్యూస్,పాణ్యం : రేషన్ బియ్యం అక్రమ గోదాములపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధికారులతో కలిసి బుధవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ సందర్బంగా గోదాముల తాళాలు తీసిన అధికారులు,అక్రమ బియ్యం స్థాక్ నిల్వలు చూసి అవాక్కయ్యారు.వెంటనే 500 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సిజ్ చేశారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు,పాణ్యం ఎస్ ఐ నరేంద్ర కుమార్ రెడ్డి,సుగాలి మెట్ట విఆర్ ఓ బిరేంద్ర పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.మద్యం తాగి వాహనం నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు.నిబంధనలు పాటించకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిత్యం పెరిగిపోతున్నాయని,మద్యం తాగి వాహనాలపై ఎక్కిఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలపైకి తెస్తున్నారని,వాటిని అరికట్టేందుకే ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఫిబ్రవరి నెలలో 1022 కేసులు, మార్చి నెలలో 702 కేసులు,ఏప్రిల్,15వ తేది వరకు 319 కేసులు నమోదు చేశారు.ఒక్కొక్కరిపై మూడువేల వరకు జరిమానా విధించారు.

హైడ్రో గంజాయి విక్రయిదారుల ముఠా అరెస్ట్...నిందితులు నుండి రూ.7.5 లక్షల విలువైన 500గ్రాముల హైడ్రో గంజాయి, మూడు చరవానీలు స్వాధీనం...సతీష్ కుమార్,గుంటూరు జిల్లా ఎస్పీ

Image
VS9TV న్యూస్,మంగళగిరి క్రైం : గంజాయి విక్రయించిన సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైడ్రో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చేప్పారు. నిందితులలో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిగా,మరో ఇద్దరూ విశాఖపట్నం చెందిన వారిగా దర్యాప్తులో తెలిసిందని,నిందితులు సంక్రాంతి నేపథ్యంలో పరిచయం పెరిగి బెంగళూరు వెళ్లి హైడ్రో గంజాయి సేవించి విక్రయించేందుకు తీసుకువస్తుండగా పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు కాజా టోల్ ప్లాజా వద్ద నిఘా వేసిన సీఐ శ్రీనివాసరావు,ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ లు గంజాయి విక్రయిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించవచ్చునని బెంగళూరులో ఉంటున్న ఒక వ్యక్తితో కలిసి అతని వద్ద హైడ్రో గంజాయి ఉన్న దాన్ని తెలుసుకొని దానికి మార...

పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.... పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..

Image
VS9TV న్యూస్,గుంతకల్ క్రైం : గుంతకల్‌లో కాల్ సెంటర్ నిర్వహిస్తుంటాడు.ఇదొక్కటే అతని వ్యాపారం కాదు.కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు రూపొందిస్తున్నాడు.వాటిని ఏకంగా నిషేధిత అశ్లీల వెబ్ సైట్లకు విక్రయిస్తున్నాడు.వీడియోలను విక్రయించి క్రిప్టో కరెన్సీ రూపంలో ప్రతిఫలం పొందుతున్నాడు.ఇతనికి శ్రీకాకుళం జిల్లా,పాత పట్నంకు చెందిన గణేష్,జోత్న్సలు సహకరిస్తున్నట్లు గుర్తించి వారిని సైబర్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈగిల్ వింగ్ ఐజి ఆకే రవిక్రిష్ణకు ముందస్తుగా రాబడిన సమాచారంతో ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు ఈ ముఠా కార్యకలాపాలను చేధించారు.ఎవరికి అనుమానం రాకుండా లూయిస్ రెండేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ పనుల దర్వా లూయిస్ రూ. 11లక్షల వరకు సంపాదించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులిస్తామంటూ ప్రలోభ పెట్టి యువతి,యువకులను ఆకర్షిస్తున్నాడు. ఆ తర్వాత వారితో పోర్న్ వీడియోలు రూపొందించడమే కాకుండా లైవ్ షోస్ ఏర్పాటు చేస్తున్నాడు.ఇందు కోసం గుంతకల్‌లో ఏకంగా స్టూడియో సెట్ అప్ వేసినట్లు ఐజి ఆకే రవి క్రిష్ణ తెలిపారు.సైప్రస్ దేశానికి చెందిన వారితో ఒప్పందం కుదుర్చుకొని ఆ...

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేసిన అవుట్ సోర్సింగ్ లస్కర్లు పర్మినెంట్ చేయాలి...ఔట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం...

Image
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కొరకు సర్వస్వం త్యాగం చేసిన అవుట్ సోర్సింగ్ లస్కర్లు తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ మంగళవారం ఔట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జల మండలి నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సర్వీస్ 62సంవత్సరాలు చేయాలని, తమ మరణం అనంతరం ఉద్యోగాలు తమ పిల్లలకు ఇచ్చేందుకు వీలు కల్పించాలని కోరుతూ నినదించారు.ఫ్ల కార్డులు చేతబట్టి సాగిన ర్యాలీ నగర పౌరులను ఆకర్షించింది.ఈ సందర్భంగా కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభను ఉద్దేశించి సంఘం అధ్యక్షులు జి.నాగన్న మాట్లాడుతూ జీఓ వచ్చి 40సంవత్సరాలు అయినా నేటికీ అమలు కాకపోవడం దురదృష్టమని వాపోయారు.జీఓ ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి దివంగత నేత ఎన్టీ రామారావు ప్రభుత్వం అన్నారు.అప్పటి నుంచి నేటి వరకు పాలించిన ప్రభుత్వాలు తమను మోసం చేశారని ఆవేదన చెందారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీఓ అమలు చేసి,పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చి,తమ కుటుంబాలను ఆదుకుని,న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ విషయంలో స్థాని...

పురమిత్ర’ ద్వారా పౌరులకు సులువుగా ప్రభుత్వ సేవలు...ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు సులువుగా ప్రభుత్వ సేవలు అందించేందుకు రూపొందించిన ‘పురమిత్ర’ యాప్‌ను నగరంలో ప్రతి పౌరుడు డౌన్లోడ్ చేసుకోవాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.స్థానిక సమస్యల ఫిర్యాదులు,వివిధ రకాల పన్నులు చెల్లింపులు వంటి అనేక రకాల సేవలను పౌరులు తమ మొబైల్ నుండే సులువుగా పొందవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను సైతం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, 9552300009 ఈ నెంబర్ ద్వారా వాట్సాప్‌లో పలు రకాల సేవలు పొందగలరని కమిషనర్ వెల్లడించారు.పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు,దరఖాస్తులు,పరిశుభ్రత, ప్రజారోగ్యం,నీటి సరఫరా,పట్టణ ప్రణాళిక,పట్టణ పేదరిక నిర్మూలన, ఇంజినీరింగ్,వీధి దీపాలు,రెవెన్యూ (పన్నులు,లీజులు) వంటి సేవల కోసం కార్యాలయాల చుట్టూ పౌరులు తిరగాల్సిన అవసరం ఇక లేదన్నారు. తమ మొబైల్‌లోనే నిర్దిష్ట సమయంలోపు సమస్యకు పరిష్కారం పొందగలరని కమిషనర్ స్పష్టం చేశారు.

నగరపాలక సంస్థ పిఆర్ ఓ బదిలీ...

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : నగరపాలక సంస్థ పిఆర్ ఓగా పనిచేస్తున్న కే.యల్.యన్.రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఆయనను ప్రకాశం జిల్లా పొదిలి మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి యస్.సురేష్ కుమార్ జీఓ నెంబర్ 303 విడుదల చేశారు. కాగా ఇప్పటికే ఆయన నందికొట్కూరు,డోన్, నగరి,పుత్తూరు మున్సిపాలిటీలకు కమిషనర్‌గా పనిచేశారు.గత ఏడాది సెప్టెంబర్‌లో కర్నూలు నగరపాలక సంస్థకు వచ్చిన ఆయనను పొదిలి మున్సిపాలిటీకి ప్రభుత్వం బదిలీ చేసింది.

హత్యాయత్నంకు పాల్పడిన నలుగురు నిందితులు అరెస్ట్...బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నంకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ బాబు ప్రసాద్ వివరాలు వెల్లడించారు.ఈ నెల 13వ తేదీన కల్లూరు మండలం,డి.మార్ట్ ప్రాంతం,టీడీపీ కార్యాలయంపై మీద దాడి చేసి,అందులో ఉన్న శేఖర్ గౌడ్,ఇతర వ్యక్తులను వేట కొడవళ్ళు, కత్తులతో హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.ఈ కేసులో నిండుతులను కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగిందన్నారు. అరెస్ట్ చేసిన వారిలో కర్నూలు నగరానికి చెందిన ఏ1 భూపని ప్రభాకర్ నాయుడు (32),ఏ2 కాశి @ కాశి బాబు(29),ఏ3 రహంతుల్లా(29),ఏ4 పటన్ సలాం ఖాన్ (29) లు ఉన్నట్లు పేర్కొన్నారు.అనంతరం వారి నుండి కత్తులు,వేట కొడవల్లను స్వాధీనం చేసుకొని, కోర్టు వారి ఎదుట హాజరచిన్నట్లు తెలిపారు.నిందితులు వీరందరూ వైసిపికి చెందిన వారు.ఈ కార్యక్రమంలో కర్నూలు నాల్గవ సిఐ మధుసూదన్ గౌడ్,ఎస్ఐ చంద్ర శేఖర్ రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.

తిరుమలేశుని సేవలో అన్నా కొణిదల... కుమారుడు మార్క్ శంకర్ పేరిట నిత్యాన్నదానానికి రూ.17లక్షలు విరాళం...

Image
VS9TV న్యూస్,తిరుపతి ప్రతినిధి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల దర్శించుకున్నారు.సోమవారం వేకువజామున వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోని ప్రవేశించి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొ న్నారు.దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొణిదలకి వేద పండితులు వేదాశీర్వచనం అందించి,శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం స్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద హారతులు ఇచ్చారు.స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన అన్నా కొణిదల  స్వామి వారి దర్శనానంతరం అన్నా కొణిదల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు.కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ.17లక్షలు విరాళాన్ని తిరుమల,తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు.అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితం అవుదాం...

Image
జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు... VS9TV న్యూస్,కర్నూలు క్రైం : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సంధర్బంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణమోహన్ లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా,కృష్ణమోహన్ లు మాట్లాడుతూ నిరుపేద,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడన్నారు.న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా,రాజకీయవేత్తగా,సామాజిక సంస్కర్తగా,రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దళితులు,మహిళలు,కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడన్నారు.అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితం కావాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు జావేద్,సోమశేఖర్ నాయక్, నారాయణ,ఆర్ ఎస్సైలు,ఎఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో చరిత్ర సృష్టించిన కేజీబీవీ విద్యార్థినులు... పి.రంజిత్ బాషా, కలెక్టర్,జిల్లా మేజిస్ట్రేట్...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లాకు గర్వకారణమైన సందర్భంలో కర్నూలు జిల్లా కలెక్టర్,జిల్లా మేజిస్ట్రేట్ పీ.రంజిత్ బాషా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీలు) విద్యార్థినులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో చరిత్ర సృష్టించారని అన్నారు.సోమవారం మూడు కేజీబీవీ విద్యార్థినులు వారి అద్భుతమైన విజయాలను జరుపుకునేందుకు కలెక్టర్ ని కలిసి అభినందనలు పొందారు.పంచలింగాల కేజీబీవీకి చెందిన టి.మానస (992), గూడూరుకు చెందిన యు.సునిత (983), ఓర్వకల్ కేజీబీవీకి చెందిన బి.హరీత (913)మార్కులు సాధించారు.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యార్థినులను ఘనంగా సన్మానిస్తూ,వారి కృషిని, పట్టుదల,విద్యా ప్రతిభను ప్రశంసించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ ఫలితాలు వారి ప్రతి ఘటన శీలతకు,నాణ్యమైన విద్య శక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పేదరికం ప్రతిభకు అడ్డుకాదు అని పేర్కొంటూ ప్రతిభావంతులైన విద్యార్థినులకు జిల్లా పరిపాలన సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. వారు అధిక ఆశయాలతో ముందుకు సాగాలని,అదే పట్టుదలతో వారి ప్రయాణాన్ని కొనసాగించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ...

అంబేద్కర్ స్ఫూర్తితో మతోన్మాదుల చేతి నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం...ప్రజా సంఘాల నాయకులు...

Image
VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,32వ వార్డు,ముజాఫర్ నగర్,కెవిపిఎస్ వార్డు అధ్యక్షులు ఇ. రామాంజనేయులు అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ, నగర కార్యదర్శి యం.భాస్కర్,సిఐటియు నాయకులు కె.సుధాకరప్ప,ఐద్వా, డివైఎఫ్ఐ నగర కార్యదర్శులు జి.ధనలక్ష్మి,యస్.హుస్సేన్ భాష,కెవిపీఎస్ నగర నాయకులు ఎం.సీ.ఆనంద్ మాట్లాడుతూ 1891,ఏప్రిల్, 14న మౌ అనే గ్రామంలో జన్మించిన అంబేద్కర్ తన చిన్నతనంలోనే చదువుకునే రోజుల్లోనే చదువు కోసం స్కూలు బయట ఒంటరిగా కూర్చోబెట్టి వారణి అప్పుడే ఆయన వివక్షకు గురయ్యాడని వారు తెలిపారు. అయినా పట్టు వీడని విక్రమార్కుడిలా ఉన్నత స్థాయి చదువులు చదువుకొని దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు.సమాజంలో కుల,మత,ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రజలందరూ సమానత్వంగా బతకాలని కోరుకున్న నాయకుడని,దళితుల పట్ల పెత్తందార్ల వివక్షకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపి కుల,మతాలతో స...

పన్నుదారులు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి...యస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్...

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపులపై వర్తింపజేస్తున్న రాయితీలను పన్నుదారులు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు సూచించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో పన్ను వసూలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...ఆస్తి పన్ను బకాయిదారుల వడ్డీపై 50శాతం రాయితీ,2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ముందస్తు చెల్లింపులపై 5శాతం పన్ను రాయితీని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.వీటికి గడువు ఏప్రిల్,30 వరకు మాత్రమేనని వెల్లడించారు.పన్నులను నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రంతో పాటు,ప్రత్యేక కౌంటర్లలో సైతం చెల్లించవచ్చన్నారు.అలాగే పురమిత్ర యాప్,మీసేవ,ఆన్లైన్ కేంద్రంలో సైతం చెల్లించవచ్చన్నారు.పన్నుదారులు సత్వరమే పన్నులు చెల్లించి రాయితీలను పొందాలని, నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ యన్.చిన్నరాముడు,ఆర్.ఓ. జునైద్,సూపరింటెండెంట్ క్రిస్టోఫర్, తదితరులు పాల్గొన్నారు.

భార్య అనుమతి లేకుండా దత్తత చెల్లదు...సుప్రీం కోర్ట్...

Image
VS9TV న్యూస్,న్యూఢిల్లీ : భార్య అనుమతి లేకుండా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.ఉత్తరప్రదేశ్లోని ఓ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. కుమార్తెలకు వారసత్వం దక్కకూడదన్న దురుద్దేశంతో చేసుకున్న దత్తత దస్తావేజుల్లో భార్య సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలని కోర్ట్ సూచించింది.

ఆటోలో మరచిపోయిన బ్యాగు, బంగారంను బాధితుడికి అప్పగించిన కర్నూలు పోలీసులు...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు కమాండ్ కంట్రోల్ పోలీసులు ఆటోలో పోగొట్టుకున్న బ్యాగ్,బంగారంను ఆదివారం గుర్తించి,బాధితుడికి అందించిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా,కొత్తపల్లెకి చెందిన శ్రీధర్ బ్యాంకు ఉద్యోగి.కర్నూలు,నంద్యాల చెక్ పోస్టు దగ్గర ఉన్న మెగా సిరి ఫంక్షన్ హాలులో ఒక పెళ్ళికి హాజరయ్యారు.అనంతరం అతని కుటుంబంతో కలిసి కర్నూలు,నంద్యాల చెక్ పోస్ట్ వద్ద ఆటో ఎక్కాడు.కర్నూలు సుంకేశుల రోడ్డులో ఉన్న కార్తీక హాస్పిటల్ నందు దిగారు.బ్యాగులో ఒక జత బంగారు కమ్మలు సుమారు (రూ.75 వేలు విలువ గల 10గ్రాముల బంగారం) ఉంది.అనంతరం హాస్పిటల్ కు వెళ్ళి చూసుకోగా బ్యాగును ఆటోలో మరచి పోయినట్లు బాధితుడు కమాండ్ కంట్రోల్ పోలీసులకు పిర్యాదు చేశాడు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సిఐ శివశింకర్ ఆధ్వర్యంలో ఎఎస్సైలు సుబ్బరాజు,అస్లాం,కానిస్టేబుళ్ళు లక్ష్మణ్,జిలానిలు సీసీ కెమెరాల ద్వారా ఆటోని ట్రేస్ ఔట్ చేశారు.ఆటో డ్రైవర్ ని పిలిపించి బాధితునికి వారి సొమ్మును తిరిగి అప్పగించారు.

డ్రోన్ కెమెరాతో ట్రాఫిక్ పరిశీలన...ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తు న్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ మేరకు ఆదివారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కర్నూలు పట్టణంలో పోలీసులు డ్రోన్లతో నిఘా పటిష్టం చేశారు.నగరంలోని ట్రాఫిక్ ను పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ట్రాఫిక్‌ ను పరిశీలించారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ...నిబంధనలు పాటించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు.ఓవర్‌ స్పీడ్‌,సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌,త్రిబుల్‌ డ్రైవింగ్‌,రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తామన్నారు. ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్‌ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తామన్నారు.ప్రధాన రహదారులు, కూడళ్లు,వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలు,ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రధాన దృష్టి సారిస్తున్నామన్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్ల ద్వారా పరిశీలించి,తగు చర్యలు తీసుకుంటున్నా మన్నారు.ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఇరుకు రోడ్లలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలన చేసి సమీక్షించారు.

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్...చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి...కర్నూలు పోలీసులు...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో ఆదివారం రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్బంగా సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

సెస్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించాలి...వల్లూరు శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : సెస్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న నిధులను గ్రంథాలయాల అభివృద్ధికి వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ అన్నారు.ఆదివారం స్థానిక ఎస్టియు భవన్ లో,అరసం జిల్లా అధ్యక్షులు కలం ప్రహ్లాద అధ్యక్షతన గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక సదస్సు ఏర్పాటుచేశారు. సదస్సుకు హాజరైన ఆయన ప్రసంగిస్తూ... స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రగిలించడానికి,సామాజిక స్పృహను పెంచడానికి,మానవీయ విలువలను పెంపొందించడానికి,అశాస్త్రీయ భావాలను తొలగించడానికి ప్రజలకు అవగాహన కలిగించడంలో గ్రంధాలయ ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయని చెప్పారు.నేడు గ్రంథాలయాలు ఆదరణకు నోచుకోక నిర్వీర్యమైన స్థితిలో ఉన్నాయని ఆవేదన చెందారు.గ్రామ గ్రామాన గ్రంథాలయాలను పునరుద్దరించాలని,ఖాళీగా ఉన్న గ్రంథాలయ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్, 27వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు.ఈ సదస్సుకు భాషా సాహితీ అభిమానులు అందరూ రావాలని పిలుపునిచ్చారు. చంద్రశేఖర కల్కురా,జే.ఎస్.ఆర్.కే శర్మ...

ఏపీలో ఐదు ప్రాంతాల్లో రోప్‌వే...

Image
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది.ఈ క్రమంలోనే ఏపీ పర్యాటక రంగం అభివృద్ధికి ఊతమిచ్చేలా కీలక అడుగు పడింది.ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది.ఏపీలో రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీలో కన్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లు ఆహ్వానిస్తున్నారు.ఈ మేరకు నేషనల్ హైవేస్ ఏపీలోని ఐదు ప్రాంతాల్లో రోప్‌వే ప్రాజెక్టుల నిర్మాణానికి గానూ డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానిస్తున్నారు.ఈ ఐదులో చిత్తూరుజిల్లా,బోయకొండ గంగమ్మ ఆలయం,కర్నూలు,అహోబిలం దేవస్థానం, పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ, విజయవాడలోని భవానీ ద్వీపం,తూర్పు గోదావరి జిల్లా,కోరుకొండలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉన్నాయి.చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద దిగువ ఆలయం నుంచి హిల్ టాప్ వరకూ 0.68కిలోమీటర్ల మేర రోప్‌వే నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. అలాగే అహోబిలం దేవస్థానం వద్ద...ఎగువ అహోబిలం నుంచి జ్వాల నరసింహస్వామి ఆలయం వరకూ 1.28 కిలోమీటర్లు.కోటప్పకొండ వద్ద కొండ దిగువ నుంచి ఎ...

పోలీస్,వైద్య,న్యాయ విభాగాలకు మధ్య వారదిలాంటిది ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగం...

Image
డాక్టర్ డి.ఎస్.ఎల్.వి నరసింహులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్... VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : పోలీస్,వైద్య,న్యాయ విభాగాలకు మధ్య వారది లాంటిది ఫోరెన్సిక్ మెడిసిన్,టాక్సి కాలజీ విభాగం అని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ డి.ఎస్.ఎల్.వి నరసింహులు అన్నారు.కర్నూలు మెడికల్ కాలేజీలో శనివారం 6వ,రెండు రోజుల రాష్ట్రస్థాయి వార్షిక ఫోర్ మేడ్కాన్ 2025 సందర్బంగా ఫోరెన్సిక్ విభాగపు అధిపతి,ప్రొఫెసర్ డాక్టర్ సాయి సుధీర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రారంభ సమావేశంలో ఆయన హాజరయ్యారు.ఈ సందర్బంగా డి.ఎం.ఇ డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ ఫోరెన్సిక్ విభాగంలో మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ అన్నది చాలా ముఖ్యమని అన్నారు.ఇది మిగిలిన డిపార్ట్మెంట్ల కంటే అధిక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు.క్లినికల్ ఫోరెన్సిక్ మెడిసిన్ అన్నది ఒపి విభాగంలో చేర్చడానికి ప్రభుత్వానికి నివేదించామని,అనుమతి లభించిన వెంటనే ఓ.పి విభాగంలో కూడా సేవలందిస్తుందన్నారు.ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ఖచ్చితమైన ఫలితాలను అందించగలుగుతుందన్నార...

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం..డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు రేంజ్ డిఐజి...విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంతో కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించారు.ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు సంయుక్తంగా శనివారం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీసుస్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించాలన్నారు.మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. బైక్ లు నడిపే వారు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్,ఓవర్ లోడ్ తో వాహనాలు వెళ్ళకుండా,డ్రంకెన్ డ్రైవ్ వంటి తదితర రోడ్డు భద్రత ప్రాముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు తెలిపారు.

ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి...ఎస్ఎఫ్ఐ...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అడ్మిషన్లకు అనుమతులు ఇవ్వకముందే కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలు మాత్రం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు చేస్తూ,నోట్ బుక్స్,స్కూల్ బ్యాగులు,యూనిఫామ్, బెల్ట్,షూస్,పాఠ్యపుస్తకాలు ఇతర స్టేషనరీ విక్రయిస్తూ అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నారు అని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ కి శనివారం శనివారం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్లా,రంగప్ప మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో విద్యార్థి శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.ఒకవైపు ప్రతి విద్యా సంవత్సరానికి ఏదో ఒక కారణంతో రూ.5 నుండి రూ.10వేలు వరకు ఫీజులు పెంచుతున్న యాజమాన్యం, మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధించే ఉపాధ్యాయులను క్వాలిఫైడ్ గా రిక్రూట్ చేయడం లేదన్నారు.విద్యార్థులు మానసికంగా ఉండడానికి వారితో ఆటలాటించడం లేదు.కొన్ని పాఠశాలలకైతే ఆడుకోవడానికి ఆట స్థలాలు కూ...

కార్మిక వర్గ ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ ఇ.బాలానందన్...ఎం.ఏ.గఫూర్,సిఐటియు రాష్ట్ర నాయకులు...

Image
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరం,కొత్తబస్టాండ్ దగ్గర ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు శనివారం సిఐటియు ప్రాంతీయ వర్క్ షాప్ ప్రారంభానికి ముందు ఉమ్మడి కర్నూలు జిల్లా సిఐటియు సీనియర్ నాయకులు మద్దులు సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం జరిగిన కామ్రేడ్ఈ బాలానందన్ శత జయంతి సభ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.ఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన వహించారు. కార్యక్రమానికి హాజరైన సిఐటియు రాష్ట్ర నాయకులు ఎం.ఎ గఫూర్,ఓబుల్ లు సభ ప్రారంభానికి ముందు ప్రఖ్యాత కార్మికనేత, సిఐటియు అఖిల భారత మాజీ అధ్యక్షులు కామ్రేడ్ ఈ బాలానందన్ శతజయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎం.ఏ గఫూర్ మాట్లాడుతూ కామ్రేడ్ బాలానందన్ కార్మికుల హక్కుల పట్ల, సిద్ధాంత వక్రీకరణల పట్ల ఏమాత్రం సడలింపులను రాజీపడని పోరాటయోధుడు, వ్యవస్థ మార్పును తీసుకురాగలిగిన కార్మిక వర్గ శక్తి సామర్థ్యం పట్ల తన జీవితం అంతం వరకు పోరాడిన పోరాట కార్యశీలి అని కొనియాడారు.బాలానందన్ ఉన్నత చదువులు అభ్యసించినప్పటికీ,ఆయనకి ఉన్న అంకిత భావం నిబద్ధత,రాజకీయ సిద్ధాంత అంశాల పట్ల చాలా లోతైన అద్భుత...

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ప్ బిల్లును వెంటనే ఉపసంహరించు కోవాలి...ముస్లింల నిరసనకు సిపిఎం మద్దతు...

Image
VS9TV న్యూస్,కల్లూరు : పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ప్ బిల్లును ఉపసంహరించు కోవాలని ముజఫర్ నగర్ లోని మస్జిద్ ఏ మదీనా హిమాయత్తుల్లా మసీద్ లో శుక్రవారం ముస్లింలు ప్రార్థన తరువాత వక్ప్ చట్టాన్ని రద్దు చేయాలని పెద్దఎత్తున నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ముస్లింలు వక్ప్ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లింల ఆస్తులకు రక్షణ కల్పించాలని, బిజెపి విధానాలు నసించాలని నినాదాలు చేశారు.నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప హాజరై మద్దతును తెలియజేశారు.అనంతరం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,ముస్లిం పెద్దలు ఉస్మాన్ భాష,షేక్షావలి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు తాము అధికారంలోకి రావడం కోసం ముస్లింల ఓట్లను దండుకోవడం కోసం ము‌స్లింల ఆస్తులు కాపాడుతామని, ముస్లింలకు న్యాయం చేస్తామని,వక్ప్ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బిల్లు సందర్భంగా తెలుగుదేశం,జనసేన పార్టీలు పోటీ పడి బిజెపి ప్రవేశపెట్టిన వక్ప్ చట్టానికి మద్దతు తెలుపడం హేయమైన చర్య అన్నారు.పార్లమెంటు, రాజ్యసభలలో బిల్లుక...

అంబేద్కర్ భవన్ ఆధునికీకరణ పనులను కమిషనర్ పరిశీలన....

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరం,రాజ్‌వీహార్ సమీపంలోని అంబేద్కర్ భవన్ లో జరుగుతున్న ఆధునికీకరణ పనులను నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు శుక్రవారం పరిశీలించి,పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ భవన్లో ఫ్లోరింగ్,పెయింటింగ్, ఎలక్ట్రికల్,తదితర ఆధునికీకరణ పనులను చేపట్టామని,ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాష భవన్‌ను ప్రారంభిస్తారని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంఈ సత్యనారాయణ,డిఈఈ క్రిష్ణలత,ట్రైనీ ఏఈ మహేష్,తదితరులు పాల్గొన్నారు.

31మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేత...

Image
డాక్టర్ కె.చిట్టి నరసమ్మ,అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్... VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు,నంద్యాల మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లు, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు యందు కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ క్రింద 9 కేటగిరీలకు చెందిన పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టి నరసమ్మ శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు లలో వివిధ టెక్నికల్,నాన్ టెక్నికల్ పోస్టుల నియమకాలకోసం 2023లో ఇచ్చిన నోటిఫికేషన్ లో మెరిట్ రోస్టర్ ప్రకారం ఎంపికైన 9కేటగిరీల చెందిన మొత్తం 31మంది అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్వజన వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు,కర్నూలు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ మంజుల రాణి,ఏఓలు లక్ష్మీప్రసన్న,రమ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా 9వ వార్షికోత్సవ వేడుకలు...దాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు..

Image
VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు.సమాచారం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని,ఆలయ కమిటీ బృందానికి సహకరించారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.విజయ్ కుమార్, వి.చంద్ర,వి.నరసింహులు,వి.కృష్ణ, టి.నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో ప్రతి నెల అమావాస్య,శ్రీరామ నవమి,వార్షికోత్సవం, హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతున్నట్లు చెప్పారు.ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు,ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిదంగా ఈ నెల 27న అమావాస్య,మే నెల 22న హనుమాన్ జయంతి కార్యక్రమాలు కూడా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం భజన భక్తబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానిక భక్తులు,ప్రజలు, భజన భక్త బృందం పాల్గొన్నారు.

తప్పిపోయిన ఇద్దరు యువతుల ఆచూకీ గుర్తించిన తాడేపల్లి పోలీసులు...

Image
VS9TV న్యూస్,తాడేపల్లి క్రైం : ఇంటర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతాం అన్న భయంతో ఇల్లు వదిలి వెళ్లిన ఇద్దరు యువతలు వెళ్లిన 24గంటల్లోపు మైనర్ బాలికలను తాడేపల్లి పోలీసులు ఆచూకీ గుర్తించి,కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. వివరాలు...విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న తాడేపల్లి,పెద్ద వడ్లపూడిలో నివాసముండే అన్నదమ్ముల కుమార్తెలు కనపడటం లేదు అని కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీసులు ఆశ్రయించారు.వారి పిర్యాదు మేరకు  సమాచారం అందుకున్న పోలీసులు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులో వారిని అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకి ఇరువురు పిల్లలను అప్పజెప్పారు. తమ పిల్లలు క్షేమంగా ఇంటికి చేరటంతో ఆనందభాష్పాలతో పోలీసులకు కృతజ్ఞతలు తెలియచేశారు.ఈ కేసు చేదనలో కృషి చేసిన సిఐ కళ్యాణ్ రాజు,ఎస్ ఐ ఖాజావలి,సిబ్బంది ని ఉన్నతాధికారులు అభినందించారు.

ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు...సీఎం చంద్రబాబు నాయుడు...

Image
VS9TV న్యూస్,ఏలూరు ప్రతినిధి : సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా, ఆగిరి పల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరిరోజు అని హెచ్చరిస్తున్నా అని అన్నారు.మహిళలను గౌరవప్రదంగా బతక నివ్వాలని,చేతనైతే విలువలు నేర్పించాలన్నారు.వైఎస్ భారతిపై చేసిన అసభ్య వ్యాఖ్యల సందర్భంలో చంద్రబాబు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శం..సమానత్వం మానవతా విలువలు పూలే సొంతం అన్నారు. బీసీలు టీడీపీకి వెన్నెముక,జిల్లాల వారీగా బీసీల అభివృద్ధికి ముందుకు వెళుతున్నామన్నారు.ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి..నేను పవన్ కల్యాణ్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాం...జీరో పవార్టీ వినూత్న కార్యకమం...పి4 కోసం తెలుగులో పేరు వెతికాం.కానీ,దొరకలేదన్నారు. సమాజంలో ఎంతో మంది గొప్పవారు అయ్యారు.ఆగిరిపల్లిలో 206కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.మార్గదర్శిలు వచ్చి ఈ క...

జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు...

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణ మోహన్ మాట్లాడుతూ...మహాత్మా జ్యోతిబా ఫూలే సంఘసంస్కర్త,కుల వ్యతిరేక కార్యకర్త,ఆలోచనాపరుడు,విద్య మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, అంటరానితనం,కులవ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారన్నారు.సామాజిక సమానత్వం, మహిళా సాధికారత,విద్యను పెంపొందించడం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు నారాయణ,సోమశేఖర్ నాయక్,ఆర్ ఎస్సైలు,ఎఆర్ పోలీసులు పాల్గొన్నారు.

విలేకరిపై దాడి హేయమైన చర్య... దుండగులను కఠినంగా శిక్షించాలి...

Image
జర్నలిస్ట్ కు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) అండ.. మధుసూదన్,కల్లూరు మండలం అధ్యక్షులు... VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు జిల్లా,దేవనకొండ మండలం, పల్లె సాక్షి పత్రిక విలేఖరి భీమలింగడుపై గత కొద్దిరోజుల క్రితం దాడి చేసిన ఎర్రమట్టి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం(UJF) కల్లూరు కమిటీ ఆధ్వర్యంలో కల్లూరు తహసీల్దార్ కె. ఆంజనేయులు ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా మండలం అధ్యక్షులు మధుసూదన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా,ఆలూరు నియోజకవర్గం,దేవనకొండ మండలం, కరిడికొండ గ్రామకొండ ప్రాంతాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న సమాచారం తెలుసుకొని ఎర్రమట్టి మాఫియాను ప్రశ్నించి, అడ్డుకోవడానికి వెళ్లిన పల్లె సాక్షి పత్రిక విలేఖరి భీమలింగడుపై ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా భయభ్రాంతులను గురిచేసేలా ఎర్రమట్టి మాఫియా,జెసిబి యజమాని కన్నప్పలు విలేకరిపై పిడుగుద్దులు,ఇనుపరాడ్ లు, పదునైన ఆయుధాలతో హత్య చేయడానికి కుట్రకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వ,ప్రజల ఆస్తులను అక్రమంగా దోపిడీ చేస్తున్న వారి అక్రమాలను తమ పత్రిక ...

కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలె...ఘనంగా జ్యోతిరావు పూలె 198వ వారోత్సవాలు...

Image
కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్ VS9TV న్యూస్,కల్లూరు : కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలె అని కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు.శుక్రవారం కర్నూలు అర్బన్, 32వ వార్డ్,ముజఫర్ నగర్ లో వార్డ్ అధ్యక్షులు ఈ రామాంజనేయులు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలె 198వ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్,సిఐటియు నగర కార్యదర్శి కె.సుధాకరప్ప,నగర సహాయ కార్యదర్శి ఎం.సి.ఆనంద్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా కెవిపిఎస్ నగర కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ 1873,సెప్టెంబరు 24న పూలే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడన్నారు.సిఐటియు నగర కార్యదర్శి కె.సుధాకరప్ప మాట్లాడుతూ మతాలు,కులాల తారతమ్యం లేకుండా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశాడని కొనియాడారు.లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడినట్లు చెప్పారు.అతను,అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు అని పేర్కొన్నా...

ప్రతి కుటుంబం నుండి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలి...నాగ శివ లీల,మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్...

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలోని న్యూ కౌన్సిల్ హాల్ నందు 2025-26 సంవత్సరంకుగాను మెప్మా కార్యక్రమాలుపై కర్నూలు,గూడూరుకు సంబంధించిన రిసోర్స్ పర్సన్ లకు గురువారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆద్వర్యంలో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నాగ శివ లీల మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక సారి (అనగా జూన్,8th,సెప్టెంబర్,8th, డిసెంబర్,8th,మార్చ్,8th) మనకు ఇచ్చిన టార్గెట్ లు తప్పక పూర్తి చేయడం తో పాటు గ్రూప్ సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.నూతన జీవనోపాధి యూనిట్ ల ఏర్పాటులో భాగంగా వారికి రుణాలు ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఆ ఋణంతో వారు ఏ యూనిట్ ను ప్రారంభిస్తున్నారు అనే విషయాలు పూర్తిగా తెలియచేయాలనీ పేర్కొన్నారు.అదే విధంగా ఏప్రిల్,15వ తేది నుండి బ్యాంక్ రుణాలు అన్ని కూడా ఆన్లైన్ లో అర్ పీ లాగిన్ లో రిక్వెస్ట్ చేయాలని,వాటిని సిఓ,సిఎంఎం,పిడి లాగిన్ లో అప్రూవల్ ఇవ్వడం ఇచ్చిన వెంటనే సంబంధిత బ్యాంక్ కు వెళుతుందన్నారు.ఆ తర్వాత బ్యాంక్ వారు లాగిన్ లో చెక్ చేసుకొని రుణాలు మంజూరు చేస్తారు.ఈ విధంగా చేయడం వలన అనర్హుల శాత...

తక్షణమే మెగా డీఎస్సీ విడుదల చేయాలి... డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి...

Image
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బిర్లా కాంపౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు గురువారం భారీగా ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ అధ్యక్షత వహించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో మొదటి సంతకం పెట్టి,మొదటికే డీఎస్సీ అభ్యర్థులని మోసం చేశారని ఆరోపించారు.పది నెలలు గడిచిన మొదటి సంతకాన్ని అమలు చేసే దిక్కు లేదని,ఇలాంటప్పుడు వారంలో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి,త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికి పదిసార్లు ప్రకటనలు చేసి, నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు.ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి కర్నూలు జిల్లాలోని డీఎస్సీ అభ్యర్థులందరిని మోసం చేశారన్నారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలని,జిల్లా మొత్తం అభ్యర్థులందరికీ ఒకే పరీక్ష పేపర్ ఉండేలా నిర్వహించాలని,రోజుకో మాట చెప్పి నిరుద్యోగులను మోసం చేయొద...

మురుగు కాలువల్లో వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవు...డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి...

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలోని మురుగు కాలువల్లో మురుగునీరు కాకుండా వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవని నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ కే.విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బంగారు పేటలోని ఓ హోటల్ నిర్వాహకులు కొంతకాలంగా వ్యర్థాలను మురుగు కాలువలో వేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో గురువారం సంబంధిత హోటల్ నిర్వాహకులకు ప్రజారోగ్య అధికారి నోటిసులు పంపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మురుగు కాలువల్లోకి కేవలం మురుగు నీరు మాత్రమే వెళ్లాలని, అందుకు భిన్నంగా ఏవైనా వ్యర్థాలు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.వ్యర్థాల కారణంగా మురుగు వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పారు.దీనిని నగర ప్రజలు,హోటల్ రెస్టారెంట్లు,మాంసపు దుకాణదారులు, ఇతరత్రా అన్ని వాణిజ్య సముదాయాల దుకాణదారులు గ్రహించి,నగరపాలక సంస్థకు సహకరించాలని ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.

మార్క్ ఆరోగ్యం మెరుగుపడింది...పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి...

Image
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గత మంగళవారం సింగపూర్ వెళ్లారు.తాజాగా మార్క్ ఆరోగ్యంపై స్పందించారు.ప్రస్తుతం మార్క్ కోలుకున్నాడని,ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.అలాగే తన కుమారుడు కోలుకోవాలని పూజలు చేసి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.