రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ ఎసిబి... డిఎస్పీ వై.రమేష్...
రూ 3.5లక్షలు లంచం తీసుకుంటు ఏసీబీ కి చిక్కిన భద్రాచలం ఎఫ్ డిఓ,డిఆర్ ఓ ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ VS9TV న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా బీటీ రోడ్డు నిర్మాణ పనులు లో కొన్ని చెట్లు తొలగించడంతో వాటి గురించి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భ ద్రాచలం అటవీ శాఖ ఎఫ్ డిఓ సుజాత రూ. 10లక్షలు డిమాండ్ చేసి గురువారం రూ 3.5 లక్షలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఆమెను,చర్ల ఇంచార్జ్ డిఆర్ ఓ కృష్ణయ్యను బహిరంగంగా పట్టుకున్నారు.చర్ల మండలం,పూసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పొరపాటున చెట్లు దెబ్బతిన్నాయి.ఈ ఎపిసోడ్ లో ఎఫ్ డిఓ సుజాత రూ.10లక్షలు డిమాండ్ చేసి భ ద్రాచలం కార్యాలయంలో రూ.3.5లక్షలు లం చం తీసుకుంటూ డిఆర్ ఓతో పాటు పట్టుబ డ్డారు.గతంలో కూడా కొత్తగూడెం అటవీ అభి వృద్ధి సంస్థ జిల్లా అధికారి రూ.3.5లక్షలు లం చం తీసుకుంటు పట్టు బడ్డారు.అటవీ శాఖలో అవినీతి పేరుకు పోయింది.ఎటువంటి సమా చారమైన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1046 కాల్ చేయాలని ఎసిబి డిఎస్పి ఉమ్మడి జిల్లాల వై.ర మేష్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ సిబ్బం ది పాల్గొన్నారు.